Saturday, February 8, 2020

భూకంపాలు

*📕 భూకంపాలు 🌎*



1) భూకంపాలను అధ్యయనం చేసే సిస్మాలజీ. వీటిని నమోదు చేసే పరికరం ఏది ?
*) భూకంప లేఖిని (సిస్మోగ్రాఫ్)*
2) భూకంపం విడుదల చేసే శక్తి తీవ్రతను కొలచే పరికరాన్ని రిక్టర్ స్కేలు అంటారు. దీన్ని ఎక్కడ రూపొందించారు ?
*) 1935లో అమెరికాలో*
3) రిక్టర్ స్కేలుపై ఎన్ని పాయింట్లు దాటితే సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు ?
*: 7.5*
4) రిక్టర్ స్కేలు విడుదల చేసే శక్తిని ఏ రసాయన పదార్థం విడుదల చేసే శక్తితో లెక్కిస్తారు ?
*: TNT ( Trinitro Tolin)*
5) భూకంపం ప్రారంభమైన ప్రదేశం (నాభి)ని ఏమంటారు ?
*: హైపో సెంటర్*
6) భూకంపం సంభవించినప్పుడు తీసుకునే జాగ్రత్తలను ఏ పదాలతో సూచిస్తారు ?
*) Drop, Cover, Hold*
7) మనదేశంలో ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్రాంతం ఏది ?
*: శివాలిక్ హిమాలయాలు*
8) దేశంలో తరుచుగా భూకంపాలు వచ్చే రాష్ట్రాలు ఏవి ?
*: అసోం, మహారాష్ట్ర, గుజరాత్*
8) మనదేశంలో భూకంప జోన్స్ ను ఎన్ని రకాలుగా విభజించారు ?
*: 5 రకాలుగా ( Bureau of Indian Standard)*
9) ఐదో భూకంప జోన్ లో ఉండి రిక్టర్ స్కేలుపై 9 కంటే ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలు (Very high risk) ఏవి ?
*: హిమాలయ పర్వత రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతం, అండమాన్ దీవులు*
10) High Risk లో ఉండి రిక్టర్ స్కేలుపై 8 కంటే ఎక్కువ భూకంపాలు నమోదయ్యే జోన్ -4 ప్రాంతం ఏది ?
*: ఢిల్లీ, గంగ, సింధు మైదానాలు*
11) దక్షిణ భారత దేశంలోని ఏపీ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు ఏ జోన్ లో ఉన్నయాి.
*: జోన్ - 3 ( Medium Risk)*
12) జోన్ 1 లో ఉండి అసలు భూకంపం రిస్క్ లేని ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి ?
*: ద్వీప కల్ప పీఠభూమిలోని కఠిన శిలామయ ప్రాంతాలు*
13) తెలుగు రాష్ట్రాలు భూకంప జోన్స్ లో 3,2 జోన్ కిందకు వస్తాయి. ఏ ప్రాంతాలు ఏ జోన్లు ?
*) హైదరాబాద్,* *అనంతపూర్ - 2 వ జోన్*
*కోస్తా ప్రాంతాలతో పాటు కడప, చిత్తూరు - 3 వ జోన్*
14) ప్రపంచంలో మొదటగా గుర్తించబడిన ఏ భూకంపంతో 8,43,000 మంది చనిపోయారు ?
*: 1556- చైనాలో*
15) ఏ దేశంలో సంభవించిన భూకంపం ప్రభావం చైనా, టిబెట్, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లపై పడింది ?
*: నేపాల్ రాజధాని ఖాట్మాండులో లామాజంగ్ కేంద్రంగా*
16) ఆపరేషన్ మైత్రి పేరుతో ఏ దేశానికి మన దేశం సాయం అందించింది ?
*: నేపాల్*


17) అత్యధిక నష్టం కలిగించింది లాతూర్, భుజ్ భూకంపాలు ఏ తీవ్రతతో వచ్చాయి ?
*: 6.4 తీవ్రతతో* *మహారాష్ట్రలోని లాతూర్*
*6.9 తీవ్రతతో గుజరాత్ లోని భుజ్ భూకంపం*
18) మన రాష్ట్రంలో తీవ్ర భూకంపం ఏప్రిల్ 13, 1969లో ఎక్కడ సంభవించింది ?
*: భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని( గతంలో ఖమ్మం జిల్లా) భద్రాచలం ఏరియాలోని కిచ్చనపల్లి - గొల్లగూడెం*
19) మన దేశంలో మొదటగా భూకంపాలను నమోదు చేసే కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
*: 1898లో కోల్ కతాలో*
20) మన రాష్ట్రంలో ఉన్న భూకంపం పరిశోధనా కేంద్రం ఏది ?
*: జాతీయ భూభౌతిక ప్రయోగ పరిశోధన కేంద్రం (NGRI- National Geophysical Research Institute)*
21) భూకంపాలను అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఏది ?
*: ఉత్తరాఖండ్ లోని రూర్కీ యూనివర్సిటీ*
22) National Sismological Data Centre ఎక్కడ ఉంది ?
*: న్యూఢిల్లీ*
23) భారత్ లో భూకంపాలను కేంద్ర ప్రభుత్వం తరపున నోడల్ ఏజెన్సీగా పనిచేసే సంస్థ ఏది ?
*: భారత్ వాతావరణ శాఖ ( Indian Meterological Department)*
24) దేశంలో భూకంపాల అధ్యయనం కోసం National Sismological Network కింద ఎన్ని అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేశారు ?
*: 55 కేంద్రాలు*
25) United Nations Development Programme, భారత ప్రభుత్వం కలసి 5లక్షలకు పైబడిన 38 నగరాల్లో భూకంపాలను అధ్యయనం చేయుటకు చేపట్టిన ప్రాజెక్టును ఏమంటారు ?
*) Urban Earthquake Vulnarability Reduction Project*
26) భూకంపాలను కూడా తట్టుకునే భవనాలను నిర్మించడానికి ఏ సంస్థ నిబంధనలను రూపొందించింది ?
*: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్*
27) జాతీయ భవన నిర్మాణ కోడ్ ను ఎప్పుడు రూపొందించారు ?
*: 1970లో ప్రస్తుతం దీన్ని జాతీయ భవన నిర్మాణ కోడ్ - 2005 గా వ్యవహరిస్తున్నారు

No comments:

Post a Comment