*📝స్థానిక స్వపరిపాలన📝*
మండల
పరిషత్» ఆంధ్రప్రదేశ్
పంచాయతీరాజ్ చట్టం 1994,
మే 30
నుంచి
అమల్లోకి వచ్చింది.
దీన్నే
'నూతన
పంచాయతీరాజ్ చట్టం'
అంటారు.» ఆంధ్రప్రదేశ్లో
668 మండలాలు
ఉన్నాయి.» తెలంగాణలో
454 మండలాలు
ఉన్నాయి.» మండలానికి
సంబంధించిన పరిపాలనా విభాగమే
మండల పరిషత్తు.» మండల
పరిషత్తును సుమారు 40
వేల జనాభాతో
దాదాపు 20, 30 గ్రామాలతో
ఏర్పాటు చేస్తారు.» పంచాయతీరాజ్
కమిషనర్ మండల జనాభాను బట్టి
ఆ మండలాన్ని కొన్ని ప్రాదేశిక
నియోజకవర్గాలుగా విభజిస్తారు.» ప్రతి
ప్రాదేశిక నియోజకవర్గంలో
3,500 జనాభా
ఉంటుంది.» ప్రతి
ప్రాదేశిక నియోజకవర్గం నుంచి
MPTC సభ్యుడిని
ఆ ప్రాదేశిక నియోజకవర్గ ఓటర్లు
ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.» మండల
పరిషత్లో కనిష్ఠంగా ఏడుగురు,
గరిష్ఠంగా
23 మంది
MPTC సభ్యులుంటారు.» MPTC
సభ్యులు
ఒకరిని అధ్యక్షుడిగా (ఛైర్మన్),
ఒకరిని
ఉపాధ్యక్షుడిగా (వైస్
ఛైర్మన్), కో-ఆప్టెడ్
సభ్యుడిగా ఒక మైనారిటీ సభ్యుడిని
ఎన్నుకుంటారు.» మండల
పరిషత్ కాలపరిమితి అయిదేళ్లు.» మండల
అధ్యక్షుడు, సభ్యుల
కాలపరిమితి అయిదేళ్లు.» ఏదైనా
కారణాల వల్ల అధ్యక్ష,
ఉపాధ్యక్ష,
సభ్యుల
స్థానాలు ఖాళీ అయితే తిరిగి
ఆరు నెలల్లోగా ఉపఎన్నిక
నిర్వహించి భర్తీ చేయాలి.» శాసనమండలిని
విధాన పరిషత్ అని కూడా
అంటారు.» మండల
అధ్యక్ష, ఉపాధ్యక్షులు,
సభ్యులు,
కో-ఆప్టెడ్
సభ్యుడు తమ రాజీనామా లేఖను
జిల్లాపరిషత్ ముఖ్య
కార్యనిర్వహణాధికారికి
పంపాలి.» మండల
పరిషత్తులో 6 రకాల
సభ్యులుంటారు.
i)
మండలంలోని
ఆయా ప్రాదేశిక నియోజకవర్గాల
నుంచి ప్రజలు ఎన్నుకున్న
సభ్యులు (MPTC)
ii)
ఆ మండల
పరిధికి చెందిన అసెంబ్లీ
సభ్యుడు (MLA)
iii)
ఆ మండల
పరిధికి చెందిన విధాన పరిషత్
సభ్యుడు
iv)
మండల పరిధిలో
ఉన్న లోక్సభ సభ్యుడు
v)
ఆ మండల
పరిధిలోని రాజ్యసభ సభ్యుడు
vi)
మైనారిటీ
వర్గం నుంచి కో-ఆప్ట్
చేసుకున్న సభ్యుడొకరుశాశ్వత
ఆహ్వానితులుగా
i)
జిల్లా
కలెక్టర్
ii)
ఆ మండల
పరిషత్ పరిధిలో ఉన్న గ్రామ
సర్పంచ్లు
iii)
మండల పరిషత్
పరిధి నుంచి జిల్లా పరిషత్కు
ఎన్నికైన సభ్యుడు
iv)
జిల్లా
పరిషత్ ఛైర్మన్
v)
వ్యవసాయ
మార్కెటింగ్ కమిటీ అధ్యక్షుడు» శాశ్వత
ఆహ్వానితులు మండల పరిషత్
సమావేశాలకు హాజరుకావచ్చు
కానీ ఓటింగ్లో పాల్గొనకూడదు.» మండల
పరిషత్కు సంబంధించిన అంశాల్లో
ప్రత్యేక నైపుణ్యం కలిగిన
వ్యక్తుల్ని సమావేశాలకు
ఆహ్వానించవచ్చు.» ప్రత్యేక
ఆహ్వానితులకు కూడా ఓటు హక్కు
ఉండదు.జిల్లా
పరిషత్» భారతదేశంలో
మొత్తం 537 జిల్లా
పరిషత్లు ఉన్నాయి.» ఆంధ్రప్రదేశ్
పంచాయతీరాజ్ చట్టం 1994
ప్రతి
జిల్లాకు ఒక జిల్లా పరిషత్ను
ఏర్పరచింది.» జిల్లా
పరిషత్లో ఎక్స్అఫీషియో
సభ్యులు, ఆ
జిల్లాలోని శాసనసభ్యులు,
జిల్లాలో
ఓటరుగా నమోదైన MLCలు,
ఆ జిల్లాలోని
లోక్సభ సభ్యులు, ఆ
జిల్లాలో ఓటరుగా నమోదైన
రాజ్యసభ సభ్యులు సమావేశాల్లో
పాల్గొనవచ్చు కానీ ఓటుహక్కు
ఉండదు.» ఆ
జిల్లా ఓటర్లుగా నమోదైన ఇద్దరు
మైనారిటీ సభ్యుల్ని కో-ఆప్ట్
చేసుకుంటారు.» కో-ఆప్ట్
చేసుకున్నవారికి ఓటు హక్కు
ఉంటుంది.» జిల్లా
పరిషత్లోని ప్రతి ప్రాదేశిక
నియోజకవర్గం నుంచి ఒక సభ్యుడిని
ఎన్నుకుంటారు. వీరు
జిల్లాపరిషత్తులో
సభ్యులవుతారు.సమావేశాలకు
శాశ్వత ఆహ్వానితులు
i)
జిల్లా
కలెక్టర్
ii)
జిల్లాలోని
మండల పరిషత్ అధ్యక్షుడు
iii)
జిల్లా
గ్రంథాలయ సంస్థ ఛైర్మన్
iv)
జిల్లా
కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్
v)
జిల్లా
మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్
పై
వారు జిల్లా పరిషత్ సమావేశాల్లో
పాల్గొనవచ్చు కానీ ఓటు హక్కు
ఉండదు.» మండల
పరిషత్ అధ్యక్షుని గౌరవవేతనం
రూ.1500» MPTC గౌరవవేతనం
రూ.750» మండల
పరిషత్కు ప్రభుత్వాధికారి
MPDOMPDO విధులు: i)
రాష్ట్ర
ప్రభుత్వ ఉత్తర్వుల్ని అమలు
చేయడం
ii)
మండల పరిషత్
తీర్మానాల్ని అమలు చేయడం
iii)
నెలకోసారి
మండల పరిషత్ సమావేశాన్ని
ఏర్పాటు చేయడం» చివరి
సమావేశం జరిగిన తేదీ నుంచి
90 రోజుల
లోపల మరొక సమావేశం ఏర్పాటు
చేయనట్లయితే MPDOపై
రాష్ట్రప్రభుత్వం క్రమశిక్షణా
చర్యలు తీసుకుంటుంది.అవిశ్వాస
తీర్మానం i) మండల
పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులపై
ప్రవేశపెట్టే అవిశ్వాస
తీర్మానంపై మొత్తం సభ్యుల్లో
కనీసం సగం మంది సంతకాలు
పెట్టాలి.
ii)
మొత్తం
పదవీకాలంలో ఒక వ్యక్తిపై
ఒకసారి కంటే ఎక్కువసార్లు
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టరాదు.
iii)
మొత్తం
సభ్యుల్లో 2/3వ
వంతు ఆమోదం తెలిపితే అవిశ్వాస
తీర్మానం నెగ్గుతుంది.
iv)
పదవీ బాధ్యతలు
చేపట్టిన అధ్యక్ష,
ఉపాధ్యక్షులపై
4 సంవత్సరాల్లోపు
అవిశ్వాస తీర్మానాన్ని
ప్రవేశపెట్టరాదు.» పదవిని
కోల్పోయిన లేదా రాజీనామా
చేసినప్పటికీ రెండేళ్ల లోపు
వారిపై విచారణ పూర్తి కావాలి.» ఈ
విధంగా తొలగినవారు రెండేళ్ల
వరకు పోటీ చేయరాదు.ఛైర్మన్,
వైస్
ఛైర్మన్లపై ప్రవేశపెట్టే
అవిశ్వాస తీర్మానంపై నిబంధనలు i)
పదవిలోకి
వచ్చిన నాలుగేళ్ల తర్వాత
మాత్రమే ప్రవేశపెట్టాలి.
ii)
2/3వ వంతు
సభ్యుల సంతకాలతో కలెక్టర్కు,
CEOకు ఒక
ప్రతిని అందించి, ఒక
ప్రతిని పంచాయతీరాజ్ శాఖ
కమిషనర్కు అందించాలి.
iii)
అవిశ్వాస
తీర్మానంపై కలెక్టర్ ఒక
ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు
చేయాలి.
iv)
సగానికంటే
ఎక్కువ మంది హాజరై సాధరణ
మెజారిటీతో తొలగించవచ్చు.జిల్లా
పరిషత్లో 7 స్థాయీ
సంఘాలుంటాయి i)
ప్రణాళిక,
ఆర్థిక
వ్యవహారాల స్థాయీ సంఘం
ii)
అభివృద్ధి
పనుల స్థాయీ సంఘం
iii)
గ్రామీణాభివృద్ధి
స్థాయీ సంఘం
iv)
వ్యవసాయాభివృద్ధి
స్థాయీ సంఘం
v)
సాంఘిక
సంక్షేమ స్థాయీ సంఘం
vi)
స్త్రీ,
శిశు సంక్షేమ
స్థాయీ సంఘం
vii)
విద్య,
వైద్య సేవల
స్థాయీ సంఘం» అన్ని
స్థాయీ సంఘాలకు జిల్లా పరిషత్
ఛైర్మన్ సభ్యునిగా
వ్యవహరిస్తారు.» అన్ని
స్థాయీ సంఘాలకు సభ్యులను
జిల్లా పరిషత్ సభ్యులు
ఎన్నుకుంటారు.» ఏ
రాజకీయ పార్టీకి చెందని
వారిని, జిల్లా
పరిషత్కు సంబంధించిన విషయాల్లో
ప్రత్యేక నైపుణ్యం కలిగిన
వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా
పిలవొచ్చు కానీ ఓటు హక్కు
ఉండదు.» జిల్లా
పరిషత్కు చెందిన సభ్యులు
పార్టీ ఆదేశానుసారం 'చేతులెత్తే'
విధానం
ద్వారా తమలో ఒకరిని ఛైర్మన్గా,
మరొకరిని
వైస్ ఛైర్మన్గా ఎన్నుకుంటారు.» ఎవరైని
సభ్యుడు పార్టీ ఆదేశాన్ని
ధిక్కరిస్తే అతని సభ్యత్వం
రద్దవుతుంది.» MLA, MPలు
ఛైర్మన్, వైస్
ఛైర్మన్ పదవులకు ఎన్నికైతే
15 రోజుల
లోపు తమ MLA, MP పదవులకు
రాజీనామా చేయాలి. లేకపోతే
ఛైర్మన్, వైస్
ఛైర్మన్ పదవులు రద్దవుతాయి.» జిల్లా
పరిషత్ సభ్యులు, ఛైర్మన్,
వైస్
ఛైర్మన్ల కాలపరిమితి అయిదేళ్లు.
» ఓటరు
జాబితాలో పేరు నమోదై 21
సంవత్సరాలు
నిండినవారు జిల్లా పరిషత్
సభ్యునిగా పోటీ చేయడానికి
అర్హులు.» ఇద్దరికంటే
ఎక్కువ మంది పిల్లలున్న వారు
పోటీ చేయడానికి అనర్హులు.» ఛైర్మన్,
వైస్ ఛైర్మన్,
ఎన్నికైన
సభ్యులు, కో-ఆప్టెడ్
సభ్యులు రాజీనామా లేఖల్ని
కలెక్టరుకు పంపించాలి.» ప్రభుత్వ
ఉత్తర్వుల్ని అమలు చేయనప్పుడు,
అధికార
దుర్వినియోగానికి పాల్పడినప్పుడు,
తమ స్వార్థానికి
అధికారాన్ని వినియోగించుకున్నప్పుడు,
అధికార
విధుల్ని నిర్వర్తించడంలో
విఫలమైనప్పుడు విషయాన్ని
వారికి తెలియజేసి అభ్యంతరాల్ని
స్వీకరించి తొలగించవచ్చు.» ఆయా
స్థాయీ సంఘాల్లోని సభ్యులు
తమరిలో ఒకరిని ఆ స్థాయీ సంఘం
అధ్యక్షునిగా ఎన్నుకుంటారు.» స్థాయీ
సంఘాల సమావేశాలు రెండు
నెలలకోకసారి తప్పనిసరిగా
జరగాలి.» స్థాయీ
సంఘాలు సలహా సంఘాలు మాత్రమే.» జిల్లా
పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిని
(సీఈవో)
రాష్ట్ర
ప్రభుత్వం నియమిస్తుంది.» జిల్లా
పరిషత్ ఛైర్మన్ను సంప్రదించి
జిల్లాపరిషత్ సమావేశాలను
సీఈవో ఏర్పాటు చేస్తారు.» కనీసం
నెలకు ఒకసారి సమావేశాన్ని
జరపాలి.» చివరి
సమావేశం జరిగిన తేదీ నుంచి
90 రోజుల
లోపల మరో సమావేశం జరపనట్లయితే
రాష్ట్ర ప్రభుత్వం సీఈవోపై
క్రమశిక్షణా చర్య తీసుకుంటుంది.» జిల్లా
పరిషత్, స్టాండింగ్
కమిటీ సమావేశాలకు సంబంధించిన
రికార్డుల్ని భద్రపరచి,
ఆ సమావేశాలకు
సంబంధించిన తీర్మానాల్ని
సీఈవో అమలు చేస్తాడు.» జిల్లా
పరిషత్ కార్యకలాపాలపై సీఈవో
పర్యవేక్షణ, నియంత్రణ
ఉంటుంది.» రాష్ట్ర
ప్రభుత్వ ఆదేశాల్ని అమలు
చేయడంతోపాటు, అమలుకు
సంబంధించిన నివేదికలను
ప్రభుత్వానికి పంపించి వాటి
ప్రతులను ఛైర్మన్, వైస్
ఛైర్మన్లకు సీఈవో
పంపిస్తారు.» ఛైర్మన్
మూడు నెలలకు ఒకసారి సమావేశాన్ని
ఏర్పాటు చేయాలి. ఏదైనా
కారణంతో 90 రోజుల్లోగా
లేదా, 90 రోజుల
తర్వాత 30 రోజుల్లోగా
సమావేశాన్ని ఏర్పాటు చేయని
పక్షంలో ఛైర్మన్ తన పదవిని
కోల్పోతాడు. పదవి
కోల్పోయిన తర్వాత ఏడాది వరకు
ఛైర్మన్గా ఎన్నిక కావడానికి
అనర్హుడవుతాడు.
పట్టణ
స్థానిక ప్రభుత్వాలు» ఒక
పట్టణ ప్రాంతంలో నివసించే
ప్రజలు తాము ఎన్నుకున్న
ప్రతినిధుల ద్వారా తమను తాము
పరిపాలించుకోవడమే పట్టణ
స్థానిక ప్రభుత్వం.» క్రీ.పూ.4వ
శతాబ్దంలో మౌర్యుల కాలంలో
మెగస్తనీస్ అనే గ్రీస్ దేశ
పర్యాటకుడు భారత్లో పర్యటించి
'ఇండికా'
అనే గ్రంథాన్ని
రచించాడు. దీనిలో
పట్టణ స్థానిక ప్రభుత్వాల
గురించి పేర్కొన్నాడు.» అక్బర్కు
వజీరుగా అబుల్ ఫజల్ ఉండేవాడు.
అతడు
'అయిన్-ఇ-అక్బరీ'
అనే తన
గ్రంథంలో భారత్లోని పట్టణ
స్థానిక ప్రభుత్వాలను గురించి
పేర్కొన్నాడు.» దేశంలో
మొదటిసారిగా 1688 సెప్టెంబర్
29న
మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్
ఏర్పాటైంది.» 1726లో
బొంబాయి, కలకత్తా
మున్సిపల్ కార్పొరేషన్లను
ఏర్పాటు చేశారు.» 1989లో
రాజీవ్గాంధీ ప్రభుత్వం
పట్టణ, నగరపాలక
సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని
కల్పించడం కోసం 65వ
రాజ్యాంగ సవరణ బిల్లును
పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
కానీ ఆ
బిల్లును చర్చిస్తున్న
సమయంలోనే సభ రద్దు కావటంతో
బిల్లు కూడా రద్త్ధెంది.» 1992లో
పి.వి.నరసింహారావు
ప్రభుత్వం పట్టణ, నగర
పాలక సంస్థలకు రాజ్యాంగ
ప్రతిపత్తిని కల్పించే 74వ
రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు
ఆమోదించింది. 20 ఏప్రిల్
1993న
రాష్ట్రపతి ఆమోదం ఈ బిల్లుకు
లభించి చట్టమైంది.» 1993,
జూన్1
నుంచి 74వ
రాజ్యాంగ సవరణ అమలులోకి
వచ్చింది.
» దేశంలో
మొదటి పట్టణాభివృద్ధి సంస్థ
- దిల్లీ
(1964)» 1985లో
మొదటిసారిగా కేంద్రం
పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖను
ఏర్పాటుచేసింది.» 74వ
రాజ్యాంగ సవరణ ద్వారా IX(A)
భాగాన్ని
& XIIవ
షెడ్యూల్ను రాజ్యాంగంలో
కొత్తగా చేర్చారు.» IX
(A) భాగంలో
243P నుంచి
243ZG వరకు
మొత్తం 18 ప్రకరణల్ని
పొందుపరిచారు.» 18 అధికార
విధులను XIIవ
షెడ్యూల్లో పొందుపరిచారు.» మున్సిపాలిటీ
వార్డుల సంఖ్య కనిష్ఠంగా 23,
గరిష్ఠంగా
50 ఉండాలి.» మున్సిపల్
కార్పొరేషన్లో వార్డుల
సంఖ్య కనిష్ఠంగా 50,
గరిష్ఠంగా
100 ఉండాలి.
» మెట్రోపాలిటన్
సిటీలో వార్డుల సంఖ్య కనిష్ఠంగా
100, గరిష్ఠంగా
200 ఉండాలి.» మున్సిపాలిటీ
సమావేశం జరిగిన తేదీ నుంచి
అయిదేళ్ల వరకు మున్సిపాలిటీ
కొనసాగుతుంది.» మున్సిపాలిటీ
పదవీకాలం ముగిసిన లేదా రద్దయిన
6 నెలల్లోగా
ఎన్నికలు నిర్వహించాలి.» XIIవ
షెడ్యూలులోని 18 అంశాలు:
1)
నగర,
పట్టణ
ప్రణాళికల రూపకల్పన
2)
భూముల
క్రమబద్ధీకరణ, భవనాల
నిర్మాణం
3)
ఆర్థిక,
సామాజికాభివృద్ధికి
సంబంధించిన ప్రణాళికలు
రూపొందించడం
4)
రోడ్లు,
వంతెనల
నిర్మాణం
5)
పారిశ్రామిక,
మానవ వనరుల
కోసం నీటి సరఫరా
6)
ప్రజారోగ్యం,
పారిశుద్ధ్య
కార్యకలాపాల నిర్వహణ
7)
అగ్నిమాపక
సేవలు
8)
పట్టణ
పర్యావరణ రక్షణ ఏర్పాట్లు
9)
బలహీనవర్గాలు,
వికలాంగులు,
మానసిక
వికలాంగుల ప్రయోజనాలకై రక్షణ
చర్యలు
10)
మురికివాడల
పరిశుభ్రత/ నిర్మూలన
11)
పట్టణ
పేదరిక నిర్మూలన
12)
పార్కులు,
తోటల ఏర్పాటు,
పర్యవేక్షణ
13)
సాంస్కృతిక
విద్యాభివృద్ధి కార్యక్రమాలు
14)
శ్మశానాల
ఏర్పాటు, నిర్వహణ
15)
జంతు సంరక్షణ,
జీవహింస
నివారణ
16)
జనన,
మరణ నమోదు
17)
పట్టణ మౌలిక
సదుపాయాల ఏర్పాటు
18)
జంతు కళేబరాల
నిర్వహణ
పట్టణ
స్థానిక ప్రభుత్వాలు మొత్తం
8 రకాలు 1)
నగరపాలక
సంస్థలు
2)
పురపాలక
సంస్థలు
3)
నగర పంచాయతీలు
4)
నోటిఫైడ్
ఏరియా కమిటీలు
5)
టౌన్ ఏరియా
కమిటీలు
6)
కంటోన్మెంటు
బోర్డు
7)
టౌన్షిప్
8)
పోర్టు
ట్రస్టు
నగరపాలక
సంస్థలు» రాష్ట్రంలోని
పెద్ద పట్టణాలను నగరపాలక
సంస్థలు (మున్సిపల్
కార్పొరేషన్)గా
ప్రకటిస్తూ శాసనసభలో చట్టం
చేయడం ద్వారా ఇవి ఏర్పడ్డాయి.» 3
లక్షల కంటే
ఎక్కువ జనాభా కలిగి,
ఆదాయం రూ.
కోటి కంటే
ఎక్కువగా ఉంటే వీటిని ఏర్పాటు
చేయవచ్చు. జనాభా
విషయంలో కొన్ని రాష్ట్రాల
మధ్య వ్యత్యాసముంది.» 1950లో
హైదరాబాద్ నగరానికి ఒక మున్సిపల్
కార్పొరేషన్ను,
సికింద్రాబాద్
నగరానికి ఒక మున్సిపల్
కార్పొరేషన్ను ఏర్పాటుచేశారు.» హైదరాబాద్
మున్సిపల్ కార్పొరేషన్ చట్టం,
1955 ప్రకారం
1960 ఆగస్టు
3న
హైదరాబాద్, సికింద్రాబాద్
మున్సిపల్ కార్పొరేషన్లను
విలీనం చేస్తూ గ్రేటర్ హైదరాబాద్
మున్సిపల్ కార్పొరేషన్ను
ఏర్పాటు చేశారు.» దేశంలో
మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ల
సంఖ్య 186.» మున్సిపల్
కార్పొరేషన్ల అన్నింటికంటే
పెద్దది - గ్రేటర్
ముంబయి మున్సిపల్
కార్పొరేషన్.» మున్సిపల్
కార్పొరేషన్లు ఎక్కువగా
కలిగిన రాష్ట్రాలు వరుసగా
-
మహారాష్ట్ర
(26), ఉత్తర్
ప్రదేశ్ (14), మధ్యప్రదేశ్
(14), ఆంధ్రప్రదేశ్
(13), తమిళనాడు
(12), కర్ణాటక
(11)» తెలంగాణలో
6 మున్సిపల్
కార్పొరేషన్లు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్లోని
మున్సిపల్ కార్పొరేషన్లు 1)
గ్రేటర్
విశాఖపట్నం
2)
కాకినాడ
3)
రాజమండ్రి
4)
ఏలూరు
5)
గుంటూరు
6)
విజయవాడ
7)
ఒంగోలు
8)
నెల్లూరు
9)
తిరుపతి
10)
కడప
11)
కర్నూలు
12)
అనంతపురం
13)
చిత్తూరు.తెలంగాణలోని
కార్పొరేషన్లు 1)
గ్రేటర్
హైదరాబాద్
2)
వరంగల్లు
3)
కరీంనగర్
4)
రామగుండం
5)
ఖమ్మం
6)
నిజామాబాద్» దేశంలోనే
మొదటిసారిగా పర్వీన్ భాను
అనే హిజ్రా కర్ణాటకలోని
బళ్లారి నగర మేయర్గా
ఎన్నికయ్యారు.» నగరపాలక
పరిధిలో రిజిస్టర్ అయిన ఓటర్లు
ప్రత్యక్షంగా కార్పొరేటర్లను
ఎన్నుకుంటారు.» వీరి
పదవీ కాలం అయిదేళ్లు.» సమావేశాలకు
మేయర్ అధ్యక్షత వహిస్తారు.» నగరపాలక
పరిధిలోని శాసనసభ్యులు,
పార్లమెంటు
సభ్యులు, కమిషనర్
సమావేశాల్లో పాల్గొంటారు.» నగరపాలక
సంస్థకు ప్రథమ పౌరుడు
మేయర్.» మేయర్
రాజకీయ అధిపతి.» మేయర్
పదవీకాలం అయిదేళ్లు.» మేయర్,
డిప్యూటీ
మేయర్లు పార్టీ ప్రాతిపదికపై
పరోక్షంగా ఎన్నికవుతారు.పురపాలక
సంఘాలు (మున్సిపాలిటీలు)» 1965లో
ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల
చట్టాన్ని రూపొందించారు.
ఇది 1965,
ఏప్రిల్
2 నుంచి
అమల్లోకి వచ్చింది.» 74వ
రాజ్యాంగ సవరణకు అనుగుణంగా
ఆంధ్రప్రదేశ్ 1994లో
మరో చట్టాన్ని చేసింది.» నగరపాలక
సంస్థకు కింద, నగర
పంచాయితీకి పైన గల పట్టణ
స్థానిక సంస్థలే పురపాలక
సంఘాలు.» పట్టణ
జనాభా 20,001 లేదా
అంతకుమించితే పురపాలక సంఘాలు
ఏర్పడతాయి.» ఆదాయాన్ని
బట్టి పురపాలక సంఘాల్ని అయిదు
గ్రేడులుగా వర్గీకరించారు.i)
సెలక్షన్
గ్రేడ్:
రూ.8
కోట్లకు
మించి ఆదాయముండే పురపాలక
సంఘాన్ని 'సెలక్షన్
గ్రేడ్' పురపాలక
సంఘమంటారు. ఇవి
ఆంధ్రప్రదేశ్లో 4 ఉంటే
తెలంగాణాలో ఒక్కటి కూడా లేదు.
ii)
స్పెషల్
గ్రేడ్:
రూ.6
కోట్ల నుంచి
రూ.8 కోట్ల
వరకు ఆదాయముండే దాన్ని 'స్పెషల్
గ్రేడ్' పురపాలక
సంఘమంటారు. ఇవి
ఆంధ్రప్రదేశ్లో 7,
తెలంగాణాలో
ఒకటి ఉన్నాయి.
iii)
ఫస్ట్
గ్రేడ్:
రూ.
4 కోట్ల
నుంచి రూ.6 కోట్ల
వరకు ఆదాయముండే దాన్ని 'ఫస్ట్
గ్రేడ్' పురపాలక
సంఘమంటారు. ఇవి
ఆంధ్రప్రదేశ్లో 13,
తెలంగాణలో
8 ఉన్నాయి.
iv)
సెకండ్
గ్రేడ్:
రూ.
2 కోట్లపై
నుంచి రూ.4 కోట్ల
వరకు ఆదాయముండే దాన్ని 'సెకండ్
గ్రేడ్' పురపాలక
సంఘమంటారు. ఇవి
ఆంధ్రప్రదేశ్లో 25,
తెలంగాణాలో
15 ఉన్నాయి.v)
థర్డ్
గ్రేడ్:
రూ.
కోటి నుంచి
రూ. 2 కోట్ల
వరకు ఆదాయమున్న మున్సిపాలిటీని 'థర్డ్
గ్రేడ్' మున్సిపాలిటీ
అంటారు. ఇవి
ఆంధ్రప్రదేశ్లో 18,
తెలంగాణాలో
13 ఉన్నాయి.
» ఆంధ్రప్రదేశ్లో
67, తెలంగాణాలో
37 పురపాలక
సంఘాలు ఉన్నాయి.» 10
లక్షల జనాభా
దాటిన ప్రాంతాన్ని 'మెట్రోపాలిటన్' ప్రాంతాలుగా
గుర్తిస్తారు.» జనాభాను
బట్టి మున్సిపాలిటీలను మూడు
గ్రేడులుగా విభజించారు.i)
6 లక్షల
నుంచి 10 లక్షల
జనాభా ఉన్న పట్టణాలను 'గ్రేడ్-I
మున్సిపాలిటీ' అంటారు.
ii) 3
లక్షల నుంచి
6 లక్షల
లోపు ఉన్న పట్టణాలను 'గ్రేడ్-II
మున్సిపాలిటీలు' అంటారు.
iii) 3
లక్షల్లో
జనాభా వున్న పట్టణాలను 'గ్రేడ్-III
మున్సిపాలిటీలు' అంటారు.» పురపాలక
సంఘం చర్చావేదికను పురపాలక
మండలి అంటారు.» పురపాలక
మండలి సాధారణంగా నెలకోకసారి
సమావేశమవుతుంది.» పురపాలక
మండలిలో ఎన్నికైన సభ్యులు,
ఎక్స్
అఫీషియో సభ్యులు, కో-ఆప్టెడ్
సభ్యులు ఉంటారు.» పురపాలక
సంఘాన్ని ఎన్నికల కోసం
వార్డులుగా విభజిస్తారు.
ప్రతి
వార్డులోని ప్రజలు ఒక సభ్యుడిని
ఎన్నుకుంటారు.» ఎక్స్
అఫీషియో సభ్యులు పదవిరీత్యా
సభ్యులు.» రాష్ట్ర
శాసనసభ సభ్యులు, శాసనమండలి
సభ్యులు, పార్లమెంటు
సభ్యులు ఆయా పురపాలక సంఘానికి
చెందినవారైతే ఎక్స్ఆఫీషియో
సభ్యులవుతారు. వీరికి
పురపాలక మండలిలో సభ్యత్వంతో
పాటు ఓటు హక్కు కూడా ఉంటుంది.» జిల్లా
కలెక్టర్, మున్సిపల్
కమిషనర్లు పదవీరిత్యా పురపాలక
మండలి సభ్యులే అయినా ఓటు హక్కు
ఉండదు.» పురపాలక
సంఘాలపై ప్రత్యేక పరిజ్ఞానం
కలిగిన వ్యక్తులు కో ఆప్ట్గా
ఉంటారు. వీరికి
కూడా ఓటు హక్కు ఉండదు.
వీరు పురపాలక
సంఘం ఓటర్ల జాబితాలో నమోదై
ఉండాలి.» మైనారిటీ
వర్గానికి చెందిన ఒకరిని
సభ్యునిగా నియమిస్తారు.
ఈయన పురపాలక
సంఘానికి చెందిన ఓటర్ల జాబితాలో
నమోదై ఉండాలి.» సభ్యులు,
ఛైర్మన్ల
పదవి కాలం అయిదేళ్లు.» పురపాలక
సంఘానికి ప్రథమ పౌరుడు
ఛైర్మన్.» ఛైర్మన్
పార్టీ ప్రాతిపదికపై పరోక్షంగా
ఎన్నికవుతారు.» పురపాలక
సంఘానికి పాలనాధికారి మున్సిపల్
కమిషనర్.నగర
పంచాయతీలు 11
వేల కంటే
ఎక్కువ, 25 వేల
కంటే తక్కువ జనాభా కలిగి ఉండి
పట్టణ ప్రాంతంగా అభివృద్ధి
చెందుతున్న గ్రామీణ ప్రాంతాన్ని
నగర పంచాయతీగా మారుస్తారు.» నగర
పంచాయతీలో 10 మంది
ఎన్నికైన వార్డు సభ్యులు,
ముగ్గురు
నామినేటెడ్ సభ్యులు ఉంటారు.» నగర
పంచాయతీ పరిధిలో ఉన్న MLA,
MLC, MPలు
సభ్యులుగా ఉంటారు.» నగర
పంచాయతీ సభ్యులు తమలో ఒకరిని
అధ్యక్షుడిగా ఎన్నుకుంటే,
మరొకరిని
ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు.» అధ్యక్ష,
ఉపాధ్యక్షులపై
పదవి స్వీకరించిన రెండేళ్ల
వరకు అవిశ్వాస తీర్మానాన్ని
ప్రవేశపెట్టరాదు.» ఆంధ్రప్రదేశ్లో
32, తెలంగాణలో
26 నగర
పంచాయతీలు ఉన్నాయి.నోటిఫైడ్
ఏరియా కమిటీలు పారిశ్రామికంగా
అభివృద్ధి చెందుతున్న
ప్రాంతాల్లో, మున్సిపాలిటీలను
ఏర్పాటు చేయడానికి అనువుగా
లేని ప్రాంతాల్లో ప్రభుత్వం
ఒక ప్రకటన ద్వారా వీటిని
ఏర్పాటు చేస్తుంది.
అందుకే
వీటిని నోటిఫైడ్ ఏరియా కమిటీలు
అంటారు.» వీటిల్లో
సభ్యులందరినీ ప్రభుత్వం
నామినేట్ చేస్తుంది.టౌన్
ఏరియా కమిటీలు» చిన్న
పట్టణాల్లో సెమీ మున్సిపల్గా
వీటిని ఏర్పాటు చేస్తారు.» వీటిల్లో
పూర్తిగా ఎన్నికైన లేదా
పూర్తిగా నామినేట్ అయిన లేదా
కొందరు నామినేట్, కొందరు
ఎన్నికైన సభ్యులు ఉంటారు.» రాష్ట్ర
శాసనసభ చేసే చట్టం ద్వారా
ఇవి ఏర్పాటవుతాయి.కంటోన్మెంట్
బోర్డు కేంద్ర
ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ
ఆధ్వర్యంలో సైనిక స్థావరాలున్న
ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు
చేస్తారు.» పార్లమెంటు
దీనికి సంబంధించిన చట్టాలను
చేస్తుంది.» కంటోన్మెంట్
బోర్డు చట్టాన్ని మొదట 1924లో
రూపొందించారు.» ఈ
చట్టాన్ని 2006లో
సవరించారు.» తెలంగాణలో
సికింద్రాబాద్లోని బొల్లారంలో
కంటోన్మెంట్ బోర్డు ఉంది.» ఇందులో
పాక్షికంగా ఎన్నికైన సభ్యులు,
నామినేటెడ్
సభ్యులు ఉంటారు. వీరి
పదవి కాలం అయిదేళ్లు.» దేశవ్యాప్తంగా
62 కంటోన్మెంట్
బోర్డులు ఉన్నాయి.» ఆ
ప్రాంత మిలటరీ కమాండింగ్
అధికారి అధ్యక్షులుగా
ఉంటారు.» సభ్యులు
తమలో ఒకరిని ఉపాధ్యక్షులుగా
ఎన్నుకుంటారు.» కార్యనిర్వాహక
అధికారిని రాష్ట్రపతి
నియమిస్తారు.టౌన్షిప్ ప్రభుత్వరంగ
సంస్థల్లో పనిచేస్తున్న
కార్మికులకు, ఉద్యోగస్థులకు
నివాస ప్రాంతాలను ఏర్పరచి
ఆ ప్రాంతాల్లో నివసించే వారికి
పౌర సదుపాయాల్ని కల్పించే
ఉద్దేశంతో టౌన్షిప్లను
ఏర్పాటు చేస్తారు.» వీటిని
యాజమాన్యాలే ఏర్పాటు
చేస్తాయి.» వీటిల్లో
ఎన్నికైన సభ్యులుండరు.» హైదరాబాద్లో
B.H.E.L టౌన్షిప్
ఉంది.» విశాఖపట్నంలో
వైజాగ్ స్టీల్ టౌన్షిప్
ఉంది.పోర్టు
ట్రస్టులు» పోర్టుల్లో
పనిచేస్తున్న ఉద్యోగులకు
పౌర సదుపాయాల్ని కల్పించే
ఉద్దేశంతో పార్లమెంటు చట్టం
ద్వారా వీటిని ఏర్పాటు
చేస్తారు.» ప్రస్తుతం
దేశంలో 13 పోర్టు
ట్రస్టులు ఉన్నాయి.» ఇందులో
ఎన్నికైన, నామినేటెడ్
సభ్యులుంటారు.» పోర్టు
ట్రస్టు ఛైర్మన్ను కేంద్ర
ప్రభుత్వం నియమిస్తుంది.» ముంబయి,
కోల్కత,
చెన్నై,
విశాఖలలో
ఇవి పనిచేస్తున్నాయి.
No comments:
Post a Comment