*🔥భారతదేశ
అత్యున్నత న్యాయస్థానం🔥*
*🇮🇳భారత
దేశంలోని అత్యున్నత
న్యాయస్థానం సుప్రీం కోర్టు.
ఇది
ఎటువంటి రాజకీయ జోక్యానికి
తావులేని రాజ్యాంగబద్ధమైన
స్వతంత్ర న్యాయ వ్యవస్థ.
ఇది హైకోర్టు లేదా ఉన్నత
న్యాయస్థానంలపై నియంత్రణాధికారం
కల్గిఉంది.*
*🔍చరిత్ర🔎*
*2019లో
తీర్పులు భారతీయ భాషలలోకి
అనువదించి ప్రకటించడం మొదలు
పెట్టింది.*
*👉నియామకాలు*
*▪సుప్రీంకోర్టు
ప్రధాన న్యాయమూర్తి సలహాపైననే
రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన
న్యాయమూర్తులను,
ఇతర
న్యాయమూర్తులను నియమిస్తాడు.
ఇందులో
31 మంది
జడ్జీలు ఉంటారు.
ప్రధాన
న్యాయమూర్తితో కలిపి ఈ
కోర్టులలో.**▪భారత
ప్రభుత్వానికి,
ఒకటి
లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల
మధ్య తగాదాలను**▪భారత
ప్రభుత్వం, ఒకటి
లేదా కొన్ని రాష్ట్రాలు ఒక
వైపు ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు
ఇంకొక వైపు ఉన్నప్పుడు వాటి
మధ్య తగాదాలను**▪రెండు
అంత కంటే ఎక్కువ రాష్ట్రాల
మధ్య తగాదాలను పరిష్కరిస్తుంటాయి.**▪ఇందులో
సివిల్ కేసు అయినా,
క్రిమినల్
కేసు అయినా, ఇతర
ఏ కేసు అయినా హైకోర్టులో
జరుగుతూ ఉన్నా,
ఆఖరి
తీర్పు అయిపోయినా ఎవరైనా ఈ
కోర్టులో (న్యాయస్థానంలో)
ఫిర్యాదు
చేసుకోవచ్చు.*
*👉సుప్రీం
కోర్టు న్యాయమూర్తి పదవీ
అర్హతలు:*
*▪భారతదేశ
పౌరుడై ఉండాలి.**▪కనీసం
5 సంవత్సరాల
కాలం హైకోర్టు న్యాయమూర్తిగా
పనిచేసి ఉండాలి.
లేదా
10 సంవత్సరాలు
హైకోర్టులో అడ్వకేట్ వృత్తి
నిర్వహించి ఉండాలి లేదా ప్రముఖ
న్యాయ శాస్త్రవేత్త అయి
ఉండాలి.*
*👉అధికార
పరిధి*
*🌟భారత
సుప్రీంకోర్టు దేశంలో
అత్యున్నతమైన న్యాయస్థానంగా పరిగణించబడుతుంది,
భారతదేశ
రాజ్యాంగంలోని అధ్యాయం అరవ
భాగం, ఐదవ
పరిధిలో ఇది ఏర్పాటు చేయబడింది. భారత
దేశం రాజ్యాంగం ప్రకారం,
ఒక సమాఖ్య
కోర్టుగా,
రాజ్యాంగ పరిరక్షణకర్తగా,
అత్యున్నత
ధర్మాసనంగా సుప్రీంకోర్టు
విధులు నిర్వహిస్తోంది.**🌟భారత
రాజ్యాంగంలోని 124
నుంచి
147 వరకు
అధికరణలు భారత అత్యున్నత
న్యాయస్థానం యొక్క కూర్పు,
అధికార
పరిధిని నిర్దేశించాయి.
ప్రధానంగా,
ఇది
రాష్ట్రాలు,
ప్రాంతాల్లోని
హైకోర్టులు ఇచ్చిన తీర్పులను
సవాలు చేసే అప్పీళ్లను
స్వీకరించే ఒక పునర్విచారణ
ధర్మాసనంగా పనిచేస్తుంది.
అయితే
తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు
సంబంధించిన కేసుల్లో అధికార
పిటిషన్లను లేదా తక్షణ
పరిష్కారం అవసరమైన తీవ్రమైన
వివాదాలకు సంబంధించిన కేసులను
కూడా ఇది విచారణకు స్వీకరిస్తుంది.
భారత
అత్యున్నత న్యాయస్థానం 1950
జనవరి
28న
స్థాపించబడింది,
అప్పటి
నుంచి ఇప్పటివరకు 24,000పైగా
కేసులను విచారించి తీర్పులు
వెలువరించింది.*
*👉సుప్రీంకోర్టు
భవనం*
*🌟సుప్రీంకోర్టు
భవనం యొక్క ప్రధాన భాగం 22
ఎకరాల
చతురస్రాకార స్థలంలో
నిర్మించబడింది,
సిపిడబ్ల్యుడికి
నేతృత్వం వహించిన తొలి
భారతీయుడిగా గుర్తింపు పొందిన
ముఖ్య వాస్తుశిల్పి గణేష్
భైకాజీ డియోలాలీకర్ దీనికి
నమూనా తయారు చేశాడు.
ఇండో-బ్రిటీష్
వాస్తు శైలిలో సుప్రీంకోర్టు
భవనాన్ని నిర్మించారు.
అతని
తరువాత శ్రీధర్ కృష్ణ జోగ్లేకర్
సుప్రీం కోర్టు భవన నిర్మాణానికి
నేతృత్వం వహించడు.న్యాయస్థానం
ప్రస్తుత భవనంలోకి 1958లో
మార్చబడింది.
న్యాయస్థానంలోని
త్రాసు ఆకారాన్ని ప్రతిబింబించే
విధంగా ఈ భవనం నమూనా తయారు
చేయబడింది, భవనం
యొక్క మధ్య భాగం త్రాసుకోలను
ప్రతిబింబిస్తుంది.1979లో
రెండు కొత్త భాగాలు -
తూర్పు
భాగం, పశ్చిమ
భాగం ఈ సముదాయానికి జోడించబడ్డాయి.
భవనంలోని
వివిధ భాగాల్లో మొత్తం 15
కోర్టు
గదులు ఉన్నాయి.
ప్రధాన
న్యాయమూర్తి ధర్మాసనం మిగిలిన
ధర్మాసనాలన్నింటి కంటే
పెద్దది, ఇది
మధ్య భాగంలో ఉంటుంది.*
*👉న్యాయస్థానం
ఏర్పాటు*
*🌟భారతదేశం
సౌర్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర
రాజ్యంగా ప్రకటించబడిన రెండు
రోజుల తరువాత,
1950 జనవరి
28న,
సుప్రీంకోర్టు
ఏర్పాటు చేయబడింది.
పార్లమెంట్
భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్లో
దీనిని ప్రారంభించారు.
దీనికి
ముందు ప్రిన్సెస్ ఛాంబర్లో
12 ఏళ్లపాటు,
1937 నుంచి
1950 వరకు
భారత సమాఖ్య న్యాయస్థానాన్ని
నిర్వహించారు.ఇప్పుడు
న్యాయస్థానం కార్యకలాపాలు
నిర్వహిస్తున్న భవన సముదాయం
సిద్ధమయ్యే వరకు,
అంటే
1958 వరకు
సుప్రీంకోర్టు కార్యకలాపాలు
కూడా ఈ ఛాంబర్లోనే కొనసాగాయి**🌟1950
జనవరి
28లో
స్థాపించిన తరువాత,
సుప్రీంకోర్టు
తన విచారణలను పార్లమెంట్
భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్లోనే
ప్రారంభించింది.
న్యాయస్థానం
ప్రస్తుత భవనంలోకి 1958లో
మార్చబడింది.
సుప్రీంకోర్టు
బార్ అసోసియేషన్ అత్యున్నత
న్యాయస్థానం యొక్క న్యాయవాదుల
సంఘంగా ఉంది.
ప్రస్తుతం
దీనికి అధ్యక్షుడిగా వికాష్
సింగ్ కొనసాగుతున్నాడు.*
*👉అధికార
పరిధి*
*🌟సుప్రీంకోర్టు
అసలైన, పునర్విచారణ
సంబంధ, సలహా
అధికార పరిధిని కలిగివుంది.**👉అసలు
అధికార పరిధి**🌟భారతదేశ
ప్రభుత్వం ఒకటి లేదా అంతకంటే
ఎక్కువ రాష్ట్రాలు మధ్య
ఏదైనా వివాదం లేదా భారత
ప్రభుత్వం, ఏదైనా
రాష్ట్రం లేదా రాష్ట్రాలు
ఒకవైపు, ఒకటి
లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు
మరోవైపు ఉన్న (త్రైపాక్షిక)
వివాదం
లేదా రెండు లేదా అంతకంటే
ఎక్కువ రాష్ట్రాల మధ్య ఉన్న
వివాదంపై ఇది ప్రత్యేక అసలు
అధికార పరిధి (అజమాయిషీ)
కలిగివుంది,
న్యాయబద్ధమైన
హక్కు యొక్క అస్థిత్వం లేదా
పరిధి ఆధారపడివున్న (చట్టపరమైన
లేదా వాస్తవానికి సంబంధించిన)
ఏదైనా
ప్రశ్నకు సంబంధించిన వివాదంపై
దీనికి ప్రత్యేక అజమాయిషీ
ఉంటుంది. అంతేకాకుండా,
రాజ్యాంగంలోని
32వ
అధికరణ ప్రాథమిక హక్కులు అమలు
చేయడానికి సంబంధించి
సుప్రీంకోర్టుకు విస్తృతమైన
మూల అధికారాన్ని అందజేసింది.
వీటిని
అమలు చేసేందుకు సుప్రీంకోర్టు నిందితుడిని
న్యాయస్థానానికి తీసుకు
రమ్మనే ఆదేశాలు, ప్రవర్తకాధిలేఖ,
నిషేధం,
అధికారాన్ని
ప్రశ్నించే ఉత్తర్వు, ఉత్ప్రేషణాధిలేఖ లకు
సంబంధించిన ఉత్తర్వులతో
కూడిన మార్గనిర్దేశాలు,
ఆదేశాలు
జారీ చేసేందుకు అధికారం
కలిగివుంది.*
*👉పునర్విచారణ
అధికార పరిధి*
*🌟సివిల్,
క్రిమినల్
రెండు రకాల కేసుల్లో ఒక హైకోర్టు
యొక్క ఏదైనా తీర్పు,
నిర్ణయం
లేదా తుది ఆదేశానికి సంబంధించి
రాజ్యాంగంలోని 132
(1), 133 (1) లేదా
134 అధికరణల
పరిధిలో సంబంధిత హైకోర్టు
జారీ చేసిన ఒక ధ్రువపత్రంతో
సుప్రీంకోర్టు యొక్క పునర్విచారణ
అధికారానికి అర్థించవచ్చు.
ఏదైనా
మిలిటరీయేతర భారతీయ కోర్టు
వెలువరించే తీర్పు లేదా
ఆదేశంపై పునర్విచారణకు
విజ్ఞప్తి చేసేందుకు సుప్రీంకోర్టు
ప్రత్యేక లీవ్ జారీ చేయగలదు.
సుప్రీంకోర్టు
యొక్క పునర్విచారణ అధికార
పరిధిని విస్తరించే అధికారం
పార్లమెంట్ కలిగివుంది,
సుప్రీంకోర్టు
(క్రిమినల్
అప్పీలేట్ జ్యురిడిక్షన్)
యాక్ట్,
1970ను
అమలు చేయడం ద్వారా క్రిమినల్
విజ్ఞప్తుల సందర్భంలో ఈ
అధికారాన్ని పార్లమెంట్
ఉపయోగించింది.*
*🌟పౌర
విషయాల్లో (ఎ)
సాధారణ
ప్రాముఖ్యత కలిగివున్న
చట్టాన్ని కేసు గణనీయమైన
స్థాయిలో సవాలు చేస్తుంటే,
(బి)
ఒక
విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు
నిర్ణయం తీసుకోవాలని భావిస్తే
అటువంటి కేసులను హైకోర్టులు
సుప్రీంకోర్టుకు పంపుతాయి.
హైకోర్టు
(ఎ)
ఒక
నిందితుడిని నిర్దోషిగా
విడిచిపెట్టి నప్పుడు లేదా
అతడికి మరణశిక్ష నుంచి యావజ్జీవ
శిక్ష వరకు విధించినప్పుడు
లేదా కనీసం పదేళ్ల కంటే ఎక్కువ
శిక్ష విధించినప్పుడు లేదా
(బి)
తన
పరిధిలోని ఏదైనా దిగువ కోర్టు
నుంచి వచ్చిన కేసుపై విచారణ
నుంచి హైకోర్టు తప్పుకున్నప్పుడు,
అటువంటి
విచారణలో నిందితుడికి మరణశిక్ష
లేదా యావజ్జీవ శిక్ష లేదా 10
ఏళ్ల
కంటే ఎక్కువ కారాగార శిక్ష
విధించబడినప్పుడు లేదా (సి)
సుప్రీంకోర్టుకు
పునర్విచారణకు పంపేందుకు
తగిన కేసుగా హైకోర్టు
భావించిన క్రిమినల్ కేసు లపై
సుప్రీంకోర్టు విచారణ
చేపడుతుంది. ఒక
హైకోర్టు క్రిమినల్ కేసు
విచారణలో వెలువరించిన తీర్పు,
తుది
ఆదేశం లేదా శిక్షను పునర్విచారణకు
స్వీకరించేందుకు సుప్రీంకోర్టుకు
తదుపరి అధికారాల ఇవ్వడంపై
ఆలోచనలు జరపడానికి పార్లమెంట్
అధికారం ఇవ్వబడింది.*
*👉సలహా
అధికార పరిధి*
*🌟రాజ్యాంగంలోని
143వ
అధికరణ పరిధిలో భారత రాష్ట్రపతి
ప్రత్యేకంగా సిఫార్సు చేసే
విషయాల్లో సలహాలు ఇచ్చేందుకు,
సుప్రీంకోర్టు
ప్రత్యేక సలహా అధికార పరిధిని
కలిగివుంది.*
*👉న్యాయ
స్వాతంత్ర్యం*
*🌟వివిధ
మార్గాల్లో సుప్రీంకోర్టు
న్యాయమూర్తులకు స్వాతంత్ర్యాన్ని
కల్పించేందుకు రాజ్యాంగం
ప్రయత్నిస్తుంది.
సాధారణంగా
ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత
లేకుండా, అనుభవం
ప్రాతిపదికన న్యాయమూర్తులు
నియమించబడతారు.
సుప్రీంకోర్టులో
ఒక న్యాయమూర్తిని తొలగించడానికి
ఒక్కొక్క లోక్సభలో కనీసం
మూడింట రెండొంతుల మంది సభ్యులు
హాజరైన ఓటింగ్లో మెజారిటీ
సభ్యులు సంబంధిత న్యాయమూర్తి
తొలగింపు ప్రతిపాదనకు మద్దతు
ఇవ్వాలి, అనంతరం
అదే సమావేశ కాలంలో రాష్ట్రపతి
సమ్మతిపై జారీ అయిన ఆదేశాలతో,
నిరూపించబడిన
దుష్ప్రవర్తన లేదా అసమర్థత
ప్రాతిపదికన సుప్రీంకోర్టులో
ఒక న్యాయమూర్తిని తొలగించవచ్చు.
సుప్రీంకోర్టు
న్యాయమూర్తి యొక్క జీతభత్యాలు
నియామకం కూడా తరువాత తగ్గించలేరు.
సుప్రీంకోర్టులో
ఒక న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి
మరే ఇతర న్యాయస్థానంలో లేదా
భారతదేశంలోని మరే ఇతర అధికారిక
యంత్రాంగంలో పని చేయడం
నిషేధించబడింది.*
*👉ధిక్కారాన్ని
శిక్షించే అధికారాలు*
*🌟భారతదేశంలోని
మరే ఇతర న్యాయస్థానాన్ని
లేదా తనను ధిక్కరించిన ఎవరినైనా
శిక్షించేందుకు రాజ్యాంగంలోని
129 మరియు
142 అధికరణ
పరిధిలో సుప్రీంకోర్టుకు
అధికారం ఇవ్వబడింది.
మహారాష్ట్ర
మంత్రి స్వరూప్ సింగ్ నాయక్
విషయంలో సుప్రీంకోర్టు ఈ
అధికారాన్ని ఉపయోగించి ఒక
అసాధారణ చర్య తీసుకుంది, 2006
మే 12న
కోర్టు ధిక్కార నేరంపై అతడికి
కోర్టు 1 నెల
జైలు శిక్ష విధించింది.
మంత్రి
పదవిలో ఉన్న ఒక వ్యక్తి జైలుకు
పంపబడటం ఇదే తొలిసారి.*
No comments:
Post a Comment