దక్షిణ భారతదేశం
🔥దక్షిణ
భారతదేశం🔥
*💐దక్షిణ
భారతదేశము దక్షిణ భారతీయులు
లేక ద్రవిడులు నివసించు
ప్రాంతం. దక్షిణ
భారతదేశము తెలంగాణ,
ఆంధ్ర
ప్రదేశ్, తమిళనాడు,
కర్నాటక,
కేరళ
రాష్ట్రాలు, కేంద్ర
పాలిత ప్రాంతాలు పాండిచ్చేరి
(పుదుచ్చేరి)ల
సముదాయము (లక్ష
దీవులు, అండమాన్
నికోబార్ దీవులు చాలా దూరముగా
ఉన్నవి). భారత
ద్వీపకల్పములో వింధ్య పర్వతములకు
దక్షిణమున ఉన్న ప్రాంతమంతా
దక్షిణ భారతదేశము.
ఉత్తరమున
నర్మదా నది, మహానది
పడమటన అరేబియా సముద్రము,
దక్షిణమున
హిందూ మహాసముద్రము,
తూర్పున
బంగాళాఖాతము ఉన్నాయి.
దక్షిణాన
చివరి స్థానం కన్యాకుమారి.
ఇరువైపులా
ఉన్న తూర్పు కనుమలు,
పడమటి
కనుమలు మధ్య దక్కన్ పీఠభూమిలతో
దక్షిణ భారతదేశము భౌగోళికంగా
కూడా వైవిధ్యము ఉంది.
తుంగభద్ర,
కావేరి,
కృష్ణ,
గోదావరి
ఇచ్చటి ముఖ్యనదులు*.
*🔥ఉపోద్ఘాతం🔥*
*💐దక్షిణ
భారతీయులు ముఖ్యంగా ద్రవిడ
భాషలు మాట్లాడెదరు అనగా
తెలుగు, తమిళం,
కన్నడ,
మలయాళం.కానీ
కొన్నిచోట్ల కొంకణి,
తుళు వంటి
భాషలు కూడా మట్లాడెదరు.
దక్షిణ
భారతాన్ని ఎందరో రాజులు
పరిపాలించారు. అందులో
ముఖ్యులు శాతవాహనులు,
ఆంధ్ర
ఇక్ష్వాకులు, చోళులు,
పాండ్యులు,
చేరులు,
చాళుక్యులు,
రాష్ట్రకూటులు,
హొయసల,
విజయనగర
రాజులు. దక్షిణ
భారత రాజవంశాలు శ్రీలంక,
శ్రీవిజయలను
జయించడం వలన ఇప్పటికీ దక్షిణ
భారత సాంస్కృతిక ప్రభావం
వారి జీవన విధానాలలో కనిపిస్తుంది*.
*ఇచట
వ్యవసాయం ప్రధాన వృత్తి.
మొత్తం
స్థూల ఉత్పత్తిలో వ్యవసాయానిదే
మొదటి స్థానం. సాఫ్టువేరు
రంగం ఇచట చాలా వేగంగా
విస్తరిస్తోంది. దేశంలోని
సాఫ్టువేరు ఉత్పత్తిలో
అధికశాతం దక్షిణ భారతదేశంలోని
నగరాలలోనే తయారవుతోంది.
చలన చిత్ర
రంగంలో కూడా దక్షిణాది తనదైన
ప్రత్యేకతతో ప్రపంచం లోని
వివిధ దేశాల ప్రజలను అలరిస్తోంది.
దక్షిణ
భారతదేశంలోని ప్రజలు దేశంలోని
మిగిలిన ప్రజలకన్నా విద్యారంగంలో
ముందుండి అత్యధిక తలసరి ఆదాయం
కలిగియున్నారు. ఇచటి
విద్యారంగం, వ్యవసాయం
రెండు వేల సంవత్సరాలుగా తన
వైశిష్ట్యాన్ని, ప్రత్యేకతను
చూపుతున్నాయి. ఇచటి
రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల
ప్రభావం అధికం*.
*దక్షిణ
భారతానికి ఆంగ్లంలో ఉన్న
సౌత్ ఇండియా (South India) అనే
కాక సంస్కృత పదం దక్షిణం వలన
డెక్కన్ (Deccan) అని
కూడా పేర్లు ఉన్నాయి.
ప్రస్తుతం
డెక్కన్ అన్న పదం దక్కను
పీఠభూమికి మాత్రమే పరిమితమైంది.
కర్ణాటక
(Carnatic) అను
పదం "కరునాడు"
అనగా నల్లని
దేశం అన్న పదం నుండి పుట్టింది.
ద్రవిడనాడు
అనునది దక్షిణ భారతానికి
ఉన్న మరొక పేరు. అలాగే
వివిధ రాష్టాలలోని ప్రజలను
వారి వారి భాషను బట్టి కూడా
పిలుస్తారు. ఉదాహరణకు
తెలుగు మాట్లాడు వారిని
ఆంధ్రులు అని, మలయాళం
మాట్లాడువారిని మలయాళీలు
అని పిలుస్తారు*.
*🔥చరిత్ర🔥*
*💐కొత్తరాతియుగమునకు
సంబంధించిన కొన్ని శిలలపై
కార్బన్ డేటింగ్ ద్వారా దక్షిణ
భారతదేశపు ఉనికిని క్రీస్తుపూర్వం
8000కి
చెందినదిగా శాస్త్రవేత్తలు
తేల్చారు. రాతి
ఆయుధాలు, కొన్ని
రాగి పాత్రలు ఈ ప్రాంతమునందు
లభించాయి. క్రీస్తు
పూర్వం 1000 నాటికి
ఇనుప యుగం ఈ ప్రాంతంలో ప్రాబల్యం
పొందినది. అయినా
ఈ ఇనుప యుగానికి ముందు బాగా
అభివృద్ధి చెందిన ఇత్తడి
యుగం ప్రాచుర్యం పొందినట్లు
ఆధారాలు లేవు [1]. దక్షిణ
భారతదేశం మధ్యధరా ప్రాంతాన్ని,
తూర్పు
ప్రాంతాన్ని కలిపే కూడలి
వంటిది. కార్వార్
నుంచి కొడంగళూర్ వరకు గల
దక్షిణ తీర ప్రాంతం ప్రాంతీయులకు,
విదేశీ
వ్యాపారస్థులకు ప్రధానమైన
వాణిజ్య కూడలిగా ఉండేది[2].
మలబార్
ప్రాంతం వారు, సంగం
ప్రాంతానికి చెందిన తమిళులు
గ్రీకులు, రోమన్లు,
అరబ్బులు,
సిరియన్లు,
చైనీయులు,
యూదులు
మొదలైన వారితో వ్యాపార సంబంధాలు
కలిగి ఉండేవారు. వీరికి
ఫోయనీషియన్లతో కూడా
సంపర్కముండేది[3]. దక్షిణ
భారతదేశాన్ని పేరెన్నికగన్న
అనేక మంది రాజులు, వంశాలు
పరిపాలించాయి. అమరావతిని
రాజధానిగా పాలించిన శాతవాహనులు,
బనవాసి
కదంబులు, పశ్చిమ
గంగ వంశము, బాదామి
చాళుక్యులు, చేర
వంశము, చోళులు,
హోయసాలులు,
కాకతీయ
వంశపు రాజులు, పల్లవులు,
పాండ్యులు,
మణ్యకేతమునకు
చెందిన రాష్ట్ర కూటులు మొదలైన
చాలామంది రాజులు పరిపాలించారు.
మధ్య యుగం
నాటికి దక్షిణ భారతంలో
మహమ్మదీయుల పెత్తనం పెరిగింది.
1323లో ఢిల్లీ
సుల్తాన్ ముహమ్మద్ బిన్
తుగ్లక్ సేనలు ఓరుగల్లును
పరిపాలిస్తున్న కాకతీయులను
ఓడించడంతో చరిత్రలో ఒక నూతన
అధ్యాయం ఆరంభమైంది.
గుల్బర్గాకు
(తరువాతి
కాలంలో బీదర్కు మార్పు)
చెందిన
బహమనీ సామ్రాజ్యం, విజయనగర
సామ్రాజ్యానికి (ఇప్పటి
హంపి) చెందిన
రాజులకు జరిగిన ఆధిపత్య
పోరాటాలు చరిత్రలో చెప్పుకోదగ్గవి.
విజయనగర
రాజుల పతనం, బహమనీ
సుల్తానుల చీలిక వల్ల హైదరాబాదు,
గోల్కొండకు
చెందిన కుతుబ్ షాహి వంశస్తులు
ప్రధాన రాజులయ్యారు.
ఔరంగజేబు
నాయకత్వంలోని మొఘాలాయి సేనలు
దక్షిణ ప్రాంతాన్ని ముట్టడించేవరకు
(7వ
శతాబ్దం మధ్యవరకూ) వీరి
ఆధిపత్యం కొనసాగింది.
అయితే
ఔరంగజేబు మరణం తర్వాత మొఘలాయిల
ఆధిపత్యం సన్నగిల్లింది.
దక్షిణ
భారతదేశపు రాజులు ఢీల్లీ
నుంచి స్వయం ప్రతిపత్తిని
సంపాదించుకున్నారు.
మైసూరు
సామ్రాజ్యానికి చెందిన
ఒడయార్లు, హైదరాబాదుకు
చెందిన ఆసఫ్ జాహీలు,
మరాఠీలు
అధికారాన్ని పొందగలిగారు*.
*పద్దెనిమిదవ
శతాబ్దం మధ్య భాగంలో అటు
ఆంగ్లేయులు, ఇటు
ఫ్రెంచి వారు దక్షిణ భారతదేశము
యొక్క సైనికాధికారానికి
దీర్ఘకాలిక పోరు సాగించారు.
యూరోపియన్
సైన్యాలకు కొన్ని ప్రాంతీయ
శక్తులకు ఏర్పడిన సంబంధాల
వలన, అన్ని
పక్షాలచే ఏర్పాటు చేయబడ్డ
కిరాయి సైన్యాలు దక్షిణ
భారతదేశంలో అల్లకల్లోలం
సృష్టించాయి. ఆంగ్లేయులతో
నాలుగు సార్లు జరిగిన మైసూరు
యుద్ధం, మూడు
సార్లు జరిగిన మరాఠా యుద్ధం
వలన మైసూరు, పూణె,
హైదరాబాద్
వంటి నగరాలు కొన్ని బ్రిటిష్
వారితోనూ, కొన్ని
ఫ్రెంచి వారితోనూ సంబంధం
కుదుర్చుకొన్నాయి.
బ్రిటిష్
వారి పరిపాలనలో దక్షిణ
భారతదేశాన్ని, మద్రాసు
ప్రెసిడెన్సీ, హైదరాబాదు,
మైసూరు,
తిరువిత్తంకూర్
('ట్రావెంకూర్'
అని కూడా
వ్యవహరిస్తారు), 'కొచి'
(కొచ్చిన్
లేదా పెరంపదపు స్వరూపం),
విజయనగరం,
ఇతర చిన్న
చిన్న రాజ్యాలుగా విభజించారు.
రాజుల
కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు
ఆంగ్ల పరిపాలకులు కొన్ని
ముఖ్యమైన రాష్ట్ర రాజధానులలో
నివాసం ఉండేవారు*.
*స్వాతంత్ర్యానంతరం
చాలావరకు దక్షిణ భారతదేశం
మద్రాసు రాష్ట్రంలో ఉండేది.
మద్రాసు
రాష్ట్రంలో మద్రాసు ప్రెసిడెన్సీ
ప్రాంతం, బనగానపల్లి,
పుదుకోట్టై,
సందూరు
మొదలైన ప్రాంతాలు కలిసి
ఉండేవి. 1953, అక్టోబరు
1న,
మద్రాసు
రాష్ట్రంలో తెలుగు ప్రధానంగా
మాట్లాడే ఉత్తర ప్రాంత జిల్లాల
పోరాటం మూలంగా భారతదేశంలో
మొట్ట మొదటి సారిగా భాషా
ప్రాతిపదికన ప్రత్యేక ఆంధ్ర
రాష్ట్రం ఏర్పాటు అయ్యింది.
నెల్లూరు
జిల్లాకు చెందిన అమరజీవి
పొట్టి శ్రీరాములు ప్రత్యేక
ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ
కావించారు. ఆ
తరువాత 1956లో
వచ్చిన రాష్ట్రాల పునర్విభజన
చట్టం క్రింద భాషా ప్రాతిపదికన
అనేక భాషాప్రయుక్త రాష్ట్రాలు
ఏర్పడ్డాయి. తరువాత
ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్
గా పేరు మార్చారు. మలయాళం
మాట్లాడే వారి కోసం ప్రత్యేక
కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు
చేశారు. 1956 తరువాత
తమిళులు అధికంగా నివసించే
ప్రాంతం కాబట్టి మద్రాసు
రాష్ట్రం 1968లో
తమిళనాడుగా రూపాంతరం చెందింది.
1972లో మైసూరు,
కర్ణాటకగా
మార్పు చెందింది. పోర్చుగీసు
వారి స్థావరమైన గోవా 1961లో
భారతదేశంలో కలపబడింది.
1987లో ప్రత్యేక
రాష్ట్రంగా అవతరించింది.
ఇంకా ఫ్రెంచి
వారి స్థావరాలైన ప్రాంతాలు
1950 నుంచి
పాండిచ్చేరి అనే కేంద్రపాలిత
ప్రాంతంగా పిలవబడుతున్నాయి*
🔥భారత
రాజ్యాంగం - ప్రాథమిక
విధులు🔥*
*💐1976
భారత రాజ్యాంగ
42వ
సవరణ ప్రకారం భారతదేశపు
పౌరులకు ప్రాథమిక విధులు
ఇవ్వబడినవి.అధికరణ
51-ఏ,
ప్రకారం
పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి.
పౌరులకు
ఇవ్వబడిన ఈ పది విధులు,
వ్యక్తగత,
పరిసరాల
పట్ల, సమాజం
పట్ల మరియు దేశం పట్ల తమ
విద్యుక్త ధర్మాన్ని
తెలియజేస్తాయి.[1] 2002 భారత
రాజ్యాంగ 86వ
సవరణ ప్రకారం 11వ
విధి ఇవ్వబడింది. ఈ
విధి, "తండ్రి
గాని, సంరక్షకుడు
గాని, తమ
బిడ్డలకు 6-14 వయస్సు
వరకు విద్యా బోధన చేపట్టాలి",
అని
బోధిస్తుంది*.
*పౌరులందరూ
తమకు ఇవ్వబడిన విధులను గౌరవించి,
దేశం పట్ల,
సమాజం పట్ల,
పరిసరాల
పట్ల తమ వ్యక్తిగత బాధ్యతను
గుర్తించి మసలుకోవలెను*.
*🔥అధికరణ
51-ఏ
ప్రకారం ప్రాథమిక విధులు🔥*
*🥀భారత
రాజ్యాంగాన్ని గౌరవించవలెను.
రాజ్యాంగపు
ఆదర్శాలను, సభలను,
జాతీయ
పతాకాన్ని, జాతీయ
గీతాన్ని గౌరవించవలెను*.
*🥀భారత
స్వతంత్ర సంగ్రామంలో,
ప్రోత్సహింపబడ్డ
ఆదర్శాలను గౌరవించాలి*.
*🥀భారతదేశపు
సార్వభౌమత్వాన్ని,
అఖండత్వాన్ని,
ఏకత్వాన్ని
గౌరవించి, పెంపొందింపవలెను*.
*🥀అవసరం
లేదా అవకాశం గలిగితే భారతదేశానికి
సేవచేయుటకు ఎల్లవేళలా సిద్ధంగా
వుండవలెను*
.
*🥀భారతదేశంలో,
కుల,
మత,
వర్గ,
లింగ,
వర్ణ విభేదాలు
లేకుండా ప్రజలందరినీ
గౌరవించవలెను*.
*🥀సోదరభావాన్ని,
సౌభ్రాతృత్వాన్నీ
పెంపొందించవలెను. స్త్రీల
యొక్క గౌరవమర్యాదలను భంగపరిచే
అమర్యాదకరమైన ఆచారాలను
పద్ధతులను విడనాడాలి*.
*🥀మన
భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతినీ,
మిశ్రమ
మరియు అద్భుత వారసత్వాన్ని
కాపాడుకొన వలెను*.
*🥀ప్రకృతీ
పరిసరాలైన అడవులను,
సరస్సులను,
నదులను
మరియు వన్యప్రాణులను మరియు
ఇతర జీవులను సంరక్షించుకొనవలెను*.
*🥀శాస్త్రీయ
దృక్పథాన్ని, వైజ్ఞానిక
విషయాలను పెంపొందించి
జ్ఞానాభివృద్ధి కొరకు ఎల్లవేళలా
పాటుపడవలెను*.
*🥀ప్రభుత్వ
ఆస్తులను, ప్రజల
ఆస్తులను కాపాడవలెను.
హింసను
విడనాడవలెను*.
*🥀భారతదేశం
అభివృద్ధి చెందునట్లు,
వ్యక్తిగతంగాను,
సామాజికంగాను
లేదా* *మిశ్రమంగానూ
పాటుపడుతూ, దేశ
ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ,
దానిని*
*సాధించుటకు
కృషిచేయవలెను*.
No comments:
Post a Comment