Saturday, April 11, 2020

అంతర్ రాష్ట్ర సంబంధాలు

*🔥అంతర్ రాష్ట్ర సంబంధాలు🔥*



*🔸సమైక్య వ్యవస్థలో రాష్ట్రాలు తమ పరిధుల్లో స్వతంత్రంగా వ్యవహరించడానికి స్వేచ్ఛ గలదో సమైక్య వ్యవస్థలో రాష్ట్రాలు తమ స్వేచ్ఛను కాపాడుకుంటూ ప్రగతి సాధనకు ఇతర రాష్ట్రాలతో సంబంధాలు ఏర్పరచుకున్నాయి.తమ స్వతంత్రాన్ని కాపాడుకుంటూనే ఇతర రాష్ట్రాల గుర్తింపును సహకారాన్ని పొందవలసి ఉంటుంది.ప్రజా సంబంధ చట్టాలను ,రికార్డులను, పద్ధతులను రాష్ట్రాలు పరస్పరం గుర్తించి గౌరవించాలి*.



*🔸న్యాయస్థానాల తో సంబంధం లేకుండా వివాదాలను పరిష్కరించుకోవడం .రాష్ట్రాల మధ్య సమన్వయం. అంతర్ రాష్ట్రాల మధ్య స్వేచ్ఛగా వ్యాపార వాణిజ్యాల ను కొనసాగించు కోవడం*.



*🔥అంతర్రాష్ట్ర వివాదాలు🔥*




*🔹భారతదేశంలో అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తినప్పుడు వాటి న్యాయస్థానాల ద్వారా కానీ న్యాయస్థానాలకు అతీతమైన పరిష్కార మార్గాల ద్వారా గాని పరిష్కరిస్తారు.పార్లమెంటరీ చట్టాలు అంతర్ రాష్ట్రాల మండలి వంటి పాలనాపరమైన సంస్థల ద్వారా పరిష్కరించబడింది*.

*🔹రాజ్యాంగంలోని నిబంధన 263 కింద అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేశారు 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం కింద జోనల్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు భారత భూభాగాన్ని ఐదు ప్రాంతీయ మండలాలుగా విభజించారు.ఆ తర్వాత 1971లో ఆరవ మండలిని ఏర్పాటు చేశారు*.



*🔥అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్🔥*



*🥀రాజ్యాంగంలోని 262 (1 )నిబంధన ప్రకారం ఏదైనా అంతర్రాష్ట్ర నదీ జలాల వినియోగం పంపిణీ నియంత్రణకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించడానికి అనువైన యంత్రాంగాన్ని పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేస్తుంది .1956లో పార్లమెంటు అంతర్ రాష్ట్ర జల వివాదాల చట్టాన్ని చేసింది ఈ చట్టాన్ని అనుసరించి ఏదైనా రాష్ట్రం ఈ విషయానికి సంబంధించి కేంద్రానికి ఫిర్యాదును పంపవచ్చు*.

*🥀వివాదానికి సంప్రదింపుల ద్వారా పరిష్కారం లభించదని కేంద్రం భావిస్తే ఆ వివాదాలను కేంద్రం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్కు నివేదించ వచ్చు.అంతర్ రాష్ట్ర నదీ జలాలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం సంబంధిత రాష్ట్రాల తో చర్చించి నది బోర్డులను 1956 నడిబొడ్డున చట్టం ప్రకారం ఏర్పాటు చేయవచ్చు.1995 నాటికి narmada కృష్ణ గోదావరి కావేరీ నదుల కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నాలుగు రాష్ట్రాల ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది


No comments:

Post a Comment