రేనాటి చోళులు
*🔥రేనాటి
చోళులు🔥*
*💐ఆంధ్ర
ప్రదేశ్ చరిత్రలో రేనాటి
చోళులకు విశేషమైన స్థానము
కలదు [1]*.
*రేనాడు
అని వ్యవహరింపబడిన (కడప
మండలములోని పులివెందుల,
కమలాపురం,
ప్రొద్దుటూరు,
జమ్ములమడుగు
తాలూకాలు, చిత్తూరు
మండలములోని మదనపల్లి,
వాయల్పాడు
తాలూకాలు) దేశ
విభాగములో తెలుగు భాష శాసనభాషగా
పరిణతి చెందింది. ఈ
ప్రాంతాన్ని మహారాజవాడి లేక
మార్జవాడి అని కూడా అంటారు.
క్రీ.
శ. 6వ
శతాబ్దము నుండి 9వ
శతాబ్దము వరకు చోళవంశమునకు
చెందిన ఒక శాఖ ఈ ప్రాంతములో
రాజ్యం చేసి క్రమంగా ఏరువ,
పొత్తపి,
నెల్లూరు,
కొణిదెన,
నిడుగల్లు,
కందూరు
అను ప్రాంతీయ వంశములుగా
ఏర్పడ్డారు. 7వ
శతాబ్దములో పర్యటించిన హుఎన్
చాంగ్ ప్రస్తావించిన చుళియ
రాజ్యమే రేనాటి చోళుల రాజ్యమని
చరిత్రకారుల అభిప్రాయం.
మొదట 7,000
గ్రామాల
పరిమితి గల దేశము 16వ
శతాబ్దినాటికి ఉదయగిరి
పెనుగొండ దుర్గముల మధ్య అధిక
భాగము ఆక్రమించి ఉంది*.
*ఈ
వంశీయులు వేయించిన శాసనములు
తెలుగుభాషలో నున్నవి.
మొట్ట మొదట
తెలుగుభాషలో శాసనములు వేయించిన
కీర్తి రేనాటిచోళులకే
దక్కినది.వీరి
శాసనములలో ఆంధ్రభాష స్థానమాక్రమించి,
ప్రాకృత
ప్రభావితమై, తెలుగు
భాష ప్రాథమిక దశను సూచించును.ప్రాకృత
పదములతో కలిసియున్న తెలుగు
పదములు, వింతవింత
రూపములతో కనిపించి,
ఆంధ్రభాషావికాసమును
పరిణామమును సూచించును.వీరి
శాసనములలో ధనంజయుని కలమళ్ళ
శాసనము మొదటి తెలుగు శాసనము
క్రీ.శ.575
లో వేయింపబడింది*.
*వీరి
మొదటి నివాసమగు చోళనాడి
తెలంగాణలోని నేటి నల్గొండ,
మహబూబునగరు
ప్రాంతమని కొందరి అభిప్రాయము.రేనాడు
ఏడువేల దేశము.అనగా
ఏడువేల గ్రామములున్న
దేశము.రేనాటిని
పాలించిరి గావున వీరు రేనాటి
చోళులు అయినారు.వీరి
శాసనముల ప్రకారము వీరు కరికాల
చోడుని సంతతివారని,
సూర్యవంశీయులని,
కాశ్యపగోత్రీయులని
తెలియుచున్నది.కడప
మండలమును పాలించినవారు రేనాటి
చోడులు.కాలక్రమమున
వీరు పాకనాడను ఆక్రమించి
చిన్న చిన్న కుటుంబములుగా
చీలి, రాజ్యములను
స్థాపించి పాలించారు.వీరిలో
రేనాడు, పాత్తపినాడు,
కొణిదెన,
నెల్లూరు
ప్రాంతములను పాలించిన
చోడవంశీయులు ప్రసిద్ధులు*.
*🔥రాజధాని🔥*
*🔴పుణ్యకుమారుని
తిప్పలూరు శాసనము ప్రకారము
వీరి రాజధాని కమలాపురము
తాలూకాలోని పెదచెప్పలి.
ఇచట
ప్రాచీనకాలపు కోట చిహ్నాలు,
తామ్రశాసనాలు,
శిలాశాసనాలు
దొరికాయి*
*🔥రాజవంశము🔥*
*🎉రేనాటి
చోళులు మొదట పల్లవరాజులకడ
సామంతులుగా ఉండి స్వతంత్రులయ్యారు.
శాసనాలను
బట్టి కరికాలుని వంశములో
నందివర్మ (క్రీ.
శ.
550), అతని
కుమారులు సింహవిష్ణు,
సుందరనంద,
ధనంజయవర్మ
(క్రీ.
శ.
575), కడపటివానికి
మహేంద్రవిక్రమ (క్రీ.
శ.
600), వానికి
గుణముదిత, పుణ్యకుమార
అను ఇద్దరు కొడుకులు పుట్టారు.
పుణ్యకుమారుడు
(క్రీ.
శ.
625) హిరణ్యరాష్ట్రము
ఏలాడు. అతని
తర్వాత కొడుకు విక్రమాదిత్య
(క్రీ.
శ.
650), శక్తికుమారుడు
(క్రీ.
శ.
675), రెండవ
విక్రమాదిత్యుడు (క్రీ.
శ.
700), సత్యాదిత్యుడు,
విజయాదిత్యుడు
(క్రీ.
శ.
750) పాలించారు.
క్రీ.
శ.
800లో శ్రీకంఠుడు
రాజ్యము చేశాడు. దీనినిబట్టి
రేనాటి చోళులు క్రీ. శ.
550 నుండి
క్రీ. శ.
850 వరకు
రాజ్యము చేశారని చెప్పవచ్చును*.
*🔥పరిపాలనా
విధానము🔥*
*🌀రేనాటి
చోడులు స్వతంత్రముగ కడప,
చిత్తూరు
మండలములను పాలించినను కొంతకాలము,
విష్ణుకుండినులు
కు, పల్లవులుకు
చాళిక్యులుకు సామంతులుగా
వ్యవహరించిరి.వీరి
కాలమున ఆంధ్రదేశము సుభిక్షముగా
నుండెను.వీరు
సూర్యరాధాధికులు.చోడమహారాజు
ఆజ్ఞగైకొని, సూర్యగ్రహణ
నిమిత్తమున సూర్యునికి
దేవాలయమును నిర్మించి,
దేవ భోగారము
కొంతభూమిని, ఒక
గానుగును దానమిచ్చినట్లు
చిలంకూరు శాసనమువలన తెలియుచున్నది*.
*వీరి
కాలమున భూమిని న్రితుడ్లలూను,
మఱుతుడ్లలోను
కొలిచెడివారు.ప్రతీ
వైశాఖ పున్నమిరోజు పండుగలు
జరుపెడివారు.దేశము
మండలములగను, విషయములుగను,
గ్రామములగ
విభజింపబడెను.గ్రామములందు
రట్టొడ్లు లేదా రాట్టులు,
లేక రెడ్లు
ప్రాముఖ్యము వహించుచుండిరి.వీరు
రైతులనందు పన్నును వశూలు
చెసి రాజుకు ఇచ్చుచుండెరివారు.పొలములను
చేను అనేవారు*.
*ఆకాలమున
శాసనములను విశ్వబ్రాహ్మణులు
అనగా పంచాణము వారిలో నొకరగు
కమ్మరులు వ్రాయుచుండిరి.శాసనలేఖకుడిని
శిల్పి* *అనిఅనెడివారు.బ్రాహ్మణులకుగాని
దేవాలయములకుగాని ఇచ్చిన
భూమిని పన్నశ అని పిలుచుచుండిరి.వీరి
యుద్ధములలో ఒకరి నొకరు కత్తులతో
పొడుచుకొని మరణించిన సంఘటనలు
ఎక్కువుగా జరిగినట్లు శాసనములు
తెలుపుచున్నవి.కొన్ని
చోట్ల పురుషులకు కుళ్ళమ్మ
అని పిలుచుచుండిరి.సేనాపతిని
చమూపతి అంటారు.రాజు
దైవాంశసంభూతుడని అప్పటి
ప్రజల విశ్వాసము.చమూపతి,
ధనాధ్యక్షుడు,
మహామంత్రి,
అమాత్యుడు
మున్నగు వారు రాజ్యమునకు
అధికారులు.ముఖ్యమైన
ఉద్యోగులకు దుగరాజు అను బిరుదు
గలదు. క్రింది
ఉద్యోగులలో పేరుల చివర 'కాలు'
అను పదము
ఉంది. రేవణకాలు,
పుద్దనకాలు,
ఎడ్లకాలు,
చేలకాలు,
తరట్లకాలు
ఉదాహరణలు*.
*స్త్రీలు
కరాభరణములు, ముక్కరలు,
కొప్పులకు
పూలు, కంకణములు
ధరించుచుండిరి.వివాహములు
సాధారణముగా నాలుగు రోజులు
జరుగు చుండెను.ప్రజలలో
వినోద ప్రదర్శనలను ప్రోత్సహించు
వారుండిరి.ఆకలమున
వాడుకలో నున్న కోడి పందెములు,
మేషమహిషయుద్ధములు,
పండుగలు,
ఏరువాకపున్నమువంటి
పండుగలు ప్రజావినోదముల్గా
పరిగణింపబడుచుండెను*.
No comments:
Post a Comment