Wednesday, April 8, 2020

భారత పాక్ యుద్ధం 1965

*🔥భారత పాక్ యుద్ధం 1965🔥*



*💐భారత్ పాకిస్తాన్‌ల సరిహద్దుల వద్ద జరిగిన చిన్న తగాదాలు ఉచ్ఛస్థితికి చేరుకోవడంతో భారత్ పాక్ యుద్ధం ప్రారంభమైంది. 1965లో భారత్ పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్దాన్ని రెండవ కాశ్మీర్ యుద్దం అని కూడా అంటారు. మొదటి కాశ్మీర్ యుద్ధం 1947లో జరిగింది. పాకిస్తాన్ తలపెట్టిన ఆపరేషన్ జిబ్రాల్టర్ యుద్దానికి మూల కారణంగా పేర్కొనవచ్చు. ఈ చర్య ముఖ్య ఉద్దేశం భారత్ కు వ్యతిరేకంగా కాశ్మీరులోకి తీవ్రవాదులను చొప్పించడం. ఐదు వారాల పాటు జరిగిన యుద్దంలో ఇరు వైపుల వేలాది మంది సైనికులు చనిపోయారు. చివరికి ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్దం ముగిసింది. ఈ యుద్దం చాలా వరకు నేల మీదే జరిగింది. కాశ్మీరులో భారీ యెత్తున బలగాలను మొహరించారు. వాయు, నావికా దళాల నుంచీ కూడా అవసరమైన సహకారం అందింది. అన్ని భారత్ పాక్ యుద్దాల లాగే ఈ యుద్ధానికి సంబంధించి కూడా చాలా విషయాలు వెలుగు లోకి రాలేదు*.
*తేదీ*
ఆగస్టు – సెప్టెంబరు 23, 1965

*ప్రదేశము*
భారత ఉపఖండము

*ఫలితము*
ఐక్యరాజ్య సమితి ద్వారా కాల్పుల విరమణ ఒప్పందం[1]. శాశ్వతమైన సరిహద్దు మార్పులు జరగలేదు.

*🔥యుద్ధానికి పూర్వపు ఘర్షణలు🔥*
*🔶1947లో భారతదేశ విభజన జరిగినప్పటి నుండి భారత్ పాక్‌లు చాలా విషయాల మీద తగువులాడుకునేవి. కాశ్మీరు ప్రధాన సమస్య అయినప్పటికీ, ఇతర సరిహద్దు తగాదాలు కూడా ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది గుజరాత్ రాష్ట్రంలోని రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతం. 1965 మార్చి 20 , ఏప్రిల్ 1965 లో పాకిస్తాన్ కావాలని రెచ్చగొట్టడంతో ఈ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.[6] ప్రారంభంలో ఘర్షణలు ఇరు దేశాల సరిహద్దు పోలీసులు మధ్యే జరిగినప్పటికీ, త్వరలోనే సైనిక దళాలు రంగంలోకి దిగాయి. 1965 జూన్‌లో, బ్రిటిష్ ప్రధానమంత్రి హెరాల్డ్ విల్‌సన్ ఇరుదేశాల మధ్య శత్రుభావనలను ఆపాల్సిందిగా ఒప్పించి, వివాద పరిష్కారానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. 1968లో వచ్చిన తీర్పు ప్రకారం రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో పాకిస్తాన్ కి 900 .కి.మీ. ఇచ్చారు. పాకిస్తాన్ మాత్రం 9,100 .కి.మీ. తన భాగంగా పేర్కొంది[7]. రాణ్ ఆఫ్ కచ్ లో పాక్ కు వచ్చిన సత్ఫలితాలు, 1962లో చైనాతో యుద్ధం వల్ల నష్టపోయిన భారత సైన్యం తనను తాను కాపాడుకోలేదని జనరల్ ఆయుబ్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ భావించింది.[8] కాశ్మీర్ ప్రజలు భారత పాలనతో విసిగిపోయారని పాకిస్తాన్ నమ్మింది. అందువల్ల చొరబాటుదారులతో ఏదైనా తిరుగుబాటు మొదలుపెట్టించి తనకు అనుకూల ఫలితాలు రాబట్టవ చ్చనుకుంది. దీనికి ఆపరేషన్ జిబ్రాల్టర్ అనే గుప్తనామం పెట్టారు.[9] కాని స్థానిక కాశ్మీరీలు పాకిస్తాన్ చొరబాటుదారుల వివరాలను అధికారులకు అందించారు. దీంతో చొరబాటుదారులను త్వరగానే కనిపెట్టడంతో ఆ ఆపరేషన్ పూర్తిగా విఫలమయ్యింది*.

*🔥యుద్దం🔥*

*📚1965 ఆగస్టు 5న పాకిస్తానుకు చెందిన 26,000 నుండి 33,000 వేల దళాలు నియంత్రణ రేఖ దాటి భారత్ లోకి కాశ్మీరీ ప్రజల లాగా భ్రమింపజేస్తూ దొంగచాటుగా చొరబడ్డారు. ఆపరేషన్ జిబ్రాల్టర్ కి జవాబుగా 1965 ఆగస్టు 5న భారత దళాలు సరిహద్దు దాటి పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీరుపై దండెత్తింది. మొదట్లో భారత దళాలకి మంచి ఫలితాలే వచ్చాయి. మూడు ముఖ్యమైన పర్వత శిఖరాలను ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆగస్టు చివరికి ఇరువైపుల వారు సమానమైన ప్రగతిని సాధించారు. పాకిస్తాన్ దళాలు తిత్వాల్, ఉరి, పూంచ్ లలో ప్రగతి కనబర్చగా, భారత దళాలు పి..కె లోని హాజి పిర్ పాస్ వరకు స్వాధీనపరుచుకున్నాయి*.

*1965 సెప్టెంబరు 1న ఆపరేషన్ గ్రాండ్‌స్లామ్ పేరుతో పాకిస్తాను ప్రతిదాడి చేసింది. దీని ముఖ్యఉద్దేశము జమ్ము లోని అఖ్నూర్ ని స్వాధీనపరుచుకోవడం. దీని వల్ల భారత దళాలకు అన్ని రకాల సరఫరా ఆగిపోతుంది. అధిక సంఖ్యలో సైన్యం, సాంకేతికంగా అభివృద్ధి చెందిన యుద్ధ ట్యాంకులతో దాడి చేసేసరికి ఇది ఊహించని భారత దళాలు బాగా నష్టపోయాయి. దీంతో భారత వాయుసేన రంగంలోకి దిగి పాకిస్తాన్ సైన్యాన్ని చెల్లాచెదురు చేసింది. మరుసటి రోజు పాకిస్తాన్ వాయుసేన కూడా భారత్ లోని కాశ్మీరు, పంజాబ్ రాష్ట్రాల్లో దాడులు చేసింది. అప్పుడు భారత సైన్యం పాకిస్తానీ పంజాబ్ వద్ద మరో యుద్దవేదిక తెరచింది. దీంతో పాకిస్తానీ పంజాబ్ ను కాపాడుకోవడం కోసం పాకిస్తాన్ కొంత సైన్యాన్ని కాశ్మీరు నుండి ఉపసంహరించుకోవలసి వచ్చింది. దీంతో ఆపరేషన్ గ్రాండ్‌స్లామ్ విఫలమైంది. జమ్మూ లోని అఖ్నూర్ ని స్వాధీనపరుచుకోలేక పోయారు. ఇది యుద్దంలో ఒక కీలకమైన మలుపు, కాశ్మీరులోని భారత దళాలకి మరికొంత లాభం చేకూర్చేందుకు కొన్ని భారత దళాలు దక్షిణ పాకిస్తాన్ లోకి దూసుకుపోయాయి*.

*🎀పడమరన ఉన్న సరిహద్దును సెప్టెంబరు 6న భారత దళాలు దాటడంతో అధికారికంగా యుద్ధం మొదలైంది. సెప్టెంబరు 6న భారత 15వ ఇన్ ఫాన్‌ట్రి దళము 2వ ప్రపంచ యుద్దం వెటరన్ మెజర్ జనరల్ ప్రసాద్ ఆద్వర్యంలోని భారత దళాలు, పాక్ పడమర భాగం లోని లిచొగిల్ కాలువ (బి.అర్.బి కాలువ) ఇది భారత్ పాక్ ల సరిహద్దు ప్రాంతము, దగ్గర పాక్ యొక్క తీవ్రమైన దాడికి గురి అయ్యాయి. జనరల్ ప్రసాద్ తన వాహనాన్ని శత్రువుల దగ్గరకు తీసుకు వెళ్ళి మెరుపు దాడి చేసి వారు పారిపోయేలా చేసారు. బర్కి అనే గ్రామము వద్ద వంతెన కట్టాలన్న ప్రయత్నం, 2వ సారి దాడిలో విజయవంతం అయింది. ఈ గ్రామం లాహొర్ కు తూర్పున చాల దగ్గరగ ఉంది. కాని పాక్ దళాలు కేంకరన్ ని దాని చుట్టుప్రక్కల గ్రామాలను ఆక్రమించుకున్నాయి, ఇది పాక్ దళాల దృష్టిని మళ్ళించింది. 2వ ఇండిపెన్డెంట్ ఆర్మర్డ్ బ్రిగేడ్ యుక్క 3 ట్యాంకు డివిజన్ సహకారం తోటి 1వ ఇన్ ఫేంటరి డివిజన్ చల త్వరగా సరిహద్దును దాటి లిఛొగిల్ (బి.అర్.బి) ను సెప్టెంబరు 6న చేరుకున్నయి. భారత దళాలు మరింత ముందుకు లహొర్ వరకు సాగకుండ ఉండేందుకు పాకిస్తన్ సైన్యం ఆ కలువపై ఉండె అన్ని వంతెనలను ధ్వంసం చెయదమొ లేక పూర్తీగా కూల్చడమో చెసాయి.భారత జట్ రెంజిమెంట్ యొక్క ఒక యునిట్, 3వ జట్లిఛిగిల్ కలువను దాటి దానికి పడమరన ఉన్నబతపొర్ పట్టణమును తమ ఆధీనం లోకి తెఛుకున్నయి. అదే రోజు పాకిస్తాన్ వాయుసేన సబ్రెస్ సహకారంతొ తన అర్మొర్డ్ డివిజన్, ఇన్ ఫేంటరి డివిజన్ భారత 15వ డివిజన్ దళాలపై ప్రతిదాడి చేసి అవి మొదలు పెట్టిన చోటికే వెళ్ళేలా చేసాయి. 3వ జెట్ దళం లోని కొద్దిమంది సైనికులు గాయపడడమొ లేక చనిపొవడమొ జరిగింది, అధిక సంఖ్యలో సరుకు రవాణా వాహనాలను, ఆయుధాలను కొల్పొయాయి, బతపొర్ ను స్వాధీనం చేసుకున్న 3వ జట్ యొక్క సమాచారం పై అధికారులకు అందలలేదు. పైగా వారికి అందిన తప్పుడు సమాచారం వలన తమ దళాలను బతపొర్, డొగ్రైయ్ నుండి ఘొషాల్ దైల్ కు పిలిపించవలసింది.ఈ పరిణామం 3వ జట్ కమండర్ అయిన Lt-Col Desmond Hayde ను తీవ్రంగ కలచివెసింది. కాని పాకిస్తన్ యొక్క అదనపు దళాలతొ మరొక తీవ్రమైన యుద్దం తరువాత 3వ జట్ 21 సెప్టెంబరున తిరిగి తమ ఆధినం లోకి తెఛుకున్నాయి*.

*🔴1965 సెప్టెంబరు 8 న రాజాస్తాన్ అర్మర్డ్ దళాల (అర్..సి) కు సహాయంగ 5వ మరాఠా లైట్ ఇన్‌ఫెన్‌ట్రీ జోధ్‌పూర్‌కు 250 కి.మీ. దూరంలో ఉన్న మునాబాకు తప్పనిసరిగా పంపవలసి వచ్చింది. వారి పని స్పష్టం -మునాబా పోస్టును చేజారిపోకుండా చూసుకోవడం, పాకిస్తాన్ ఇన్ ఫెన్ టరి దళాలు ఈ పోస్ట్ దరిదాపులకు కూడా రాకుండా ఆపడం. కాని మరాఠా కొండ (మునబఒలో ఉన్నది) వారికి కొత్త దీని కోసం భారత దళాలు 24గంటల పాటు చాల తీవ్రంగ పోరాడవలసి వఛింది. ముగ్గురు సైనికులు 954 భారీ మొటార్ బేటరీ ఆయుధాలతొ కూడిన ఒక పాకిస్తాన్ దళం మునబఓ దగ్గర ఉన్న అర్..సి పొస్ట్ను చేరుకోలేకపోయింది. పాకిస్తాన్ వాయుసేన మొత్తం ఆ ప్రదేశం పై బాంభులతో దాడి చేసింది, ఆంతేకాకుండ బర్మేర్ నుండి అదనపు దళాల తోటి వస్తున్న రైలుపై కూడా గాద్ర రోడ్ రైల్వే స్టేషను దగ్గర దాడి చేసింది. చివరకు ఎంత ప్రయతించినా 1965 సెప్టెంబరు 10న మునబఒ పాకిస్తాన్ చేజారి పోయింది, దానిని కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమైంది*.

*🔹అంతకు ముందు సెప్టెంబరు 9న రెండు దేశాలు మొదటిలో అసమానమైన యుద్దాలతొ తమ సైన్యాలను మొహరించి ఉన్నాయి. భారత్ యొక్క గర్వకారనమైన సైన్యం అను బిరుదు గల 1వ అర్మర్డ్ డివిజన్ను సీల్కొట్ వద్ద ముందుకు వెల్లేందుకు మోహరించింది. ఈ డివిజన్ రెండుగ విడిపోయి దాదాపు 100 ట్యాంకులను కోల్పోయి పాకిస్తాన్ 6వ అర్మర్డ్ డివిజన్ వల్ల బలవంతంగ ఛవింద నుండి వెల్లగొట్టబడ్డాయి. భారతీయులను వెనుకడుగు వేసేలచేసిన పాకితానియులు ఆపరేషన్ విండ్అప్ ను ప్రారంభించింది.అదే సమయంలో పాకిస్తాన్కు గర్వకారనమైన 1వ ఆర్మర్డ్ డివిజన్ అమ్రుత్సర్, బెఅస్ నదీ వంతెనను, జలన్ధర్ లను ఆక్రమించుకునే ఉద్దేశంతో ఖేమ్‌కరణ్ వైపునకు వెళ్ళాయి*.

*🔷పాకిస్తాన్ 1వ ఆర్మర్డ్ డివిజన్ ఖేంకరన్ నుండి ముందుకు కదలలేకపోయాయి. ఏదిఏమైన సెప్టెంబరు 10 చివరన దానిని భారత్ 4వ మోన్ టైన్ డివిజన్ అస్సల్ ఉత్తర్ (సరిఆయిన సమాధానం) యుద్దం చేసింది, ఈ దాడి వల్ల పాక్ దానిని కాపాడుకోలేకపోయింది. ఆ ప్రదేశం 'పెట్టన్ నగర్' (పెట్టన్ పట్టణము) గ మారిపోయింది, కారణం: అమెరికా తయారీ పాకిస్తాన్ పెట్టన్ ట్యాంకులు దాదాపు 97 ట్యంకులను కోల్పోవడమొ లేదా వదిలి పారిపోవడమో జరిగింది, ఇందులో భారత్ కేవలం 32ట్యాంకులు ధ్వంసం కావడం లేదా దెబ్బతినడం జరిగింది.అటు తరువాత పాకిస్తాన్ 1వ ఆర్మర్డ్ డివిజన్ కొద్దీగ 5వ ఆర్మర్డ్ బ్రిగేడ్ సియాల్కోట్ వైపునకు పంపించబడ్డాయి, ఇవి పాకిస్తాన్ 6వ ఆర్మర్డ్ డివిజన్ వెనుకన ఉన్నాయి. ఇక్కడ పాకిస్తాన్ 6వ ఆర్మర్డ్ డివిజన్ అంతవరకూ పోరాడలేదు. అయితే అప్పటికే 6వ అర్మర్డ్ డివిజన్ అత్యంత శక్తి వంతమైన భారత 1వ ఆర్మర్డ్ డివిజన్ వైపునకు కదులుతూంది*.

*🎶యుద్దం సంధి వైపుకు మరలింది. రెండు దళాలు కూడా ఇంకొకరి భూభాగాలను తమతమ ఆధీనంలో ఉంచుకున్నాయి. ఈ యుద్ధంలో భారత్ 3,000 మంది సైనికులను కోల్పోగా, పాకిస్తాన్ 3,800 మందిని కోల్పోయింది. భారత్ 1,800 .కి.మీ. పాకిస్తాన్ భూబాగాన్ని ఆక్రమించుకోగా, పాకిస్తాన్ 550 .కి.మీ. భారత్ భూభాగాన్ని తన ఆధీనంలో ఉంచుకుంది. భారత్ ముఖ్యంగా సియాల్‌కోట్ పరిసర ప్రాంతాలను, లాహోర్, కశ్మీర్ సెక్టార్ ప్రాంతాలను తన ఆధీనంలో ఉంచుకోగా, పాకిస్తాన్ ఆక్రమించుకున్నది దక్షిణాన ఉన్న ఎడారి ప్రాంతం సింద్‌కు ఎదురుగా, ఉత్తర కాశ్మీర్ దగ్గర్లోని చుంబ్ సెక్టార్*.




*🔥గగనతలంలో యుద్ధం🔥*

*🌐భారత వాయు సేన, పాకిస్తాన్ వాయు సేనలు స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా ఈ యుద్ధంలోనే పాల్గొన్నాయి. మొదటి కాశ్మీర్ యుద్ధంలో ఇరువురూ తలపడినప్పటికీ, ఈ యుద్ధంతో పోలిస్తే అప్పట్లో వీటి వినియోగ విస్తృతి పరిమితమైనదిగా చెప్పచ్చు*.

*భారత వాయు సేన ఉపయోగించిన వాటిలో ఇవి ఉన్నాయి : అధిక సంఖ్యలో హాకర్ హన్టర్‌లు, స్వదేశంలో తయారుచేసిన ఫోలాండ్ గ్నాట్స్, డి హావిల్లాన్డ్ వాంపైర్స్, ఇఇ కాన్‌బెర్రా బాంబర్స్, మిగ్-21లతో కూడిన ఒక దళం*.

*పాకిస్తాన్ వాయుసేన ఉపయోగించిన వాటిలో ఇవి ఉన్నాయి: 102 F-86 సేబర్‌లు, 12 F-104 స్టార్ ఫైటర్లతో కూడిన 24 B-57 కాన్‌బెర్రా బాంబర్లు. వివాద సమయంలో భారత్ వాయుసేన పాక్ వాయుసేన కంటే 5:1 నిష్పత్తితో సంఖ్యాపరమైన ఆధిక్యత కలిగి ఉంది.[10]*

*పాక్ వాయుసేన ఎక్కువగా అమెరికా తయారు యుద్ధ విమానాలను కలిగి ఉంది. భారత వాయుసేన సోవియట్, యూరోపియన్ తయారీ విమానాలను కలిగి ఉంది. భారత వాయుసేన కంటే పాక్ వాయుసేన విమానాలు ఎక్కువ సామర్థ్యం కలవని సమాచారం. కాని కొంత మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది నిజం కాదు; ఎందుకంటే భారత మిగ్-21, హాకర్ హన్టర్. ఫొలేంద్ గ్నాట్ యుద్ధవిమానాలు పాకిస్తాన్‌కు చెందిన F-86 Sabre కన్నా ఎక్కువ సామర్ద్యాన్ని ప్రదర్శించాయి. ఈ యుద్దంలో పాక్ వాయుసేన యొక్క 19వ స్క్వాడ్రన్కు నాయకత్వం వహించిన, పదవీవిరమణ పొందిన Air Cdre Sajjad Haider ప్రకారం F-86 Sabre కన్నా భారత్ యొక్క అన్ని డి హావిల్లాన్డ్ వాంపైర్స్ బాంబర్లు కాలం చెల్లినవి. హాకర్ హంటర్ ఫైటర్లు సామర్ద్యం మరియూ వేగం లోనూ ఎంతో గొప్పవి*.

*భారతీయుల ప్రకారం సేబర్ స్లేయర్ అనే పేరుగల F-86లు ఫోల్లేంద్ గ్నాట్స్ కన్నా ఎంతో మెరుగైనవి. పాకిస్తాన్ వాయుసేనకు చెందిన F-104 స్టార్ఫైటర్లు ఆసమయంలో ఉపఖండం లోనే అత్యంత వేగవంతమైనవి, అందుకే వీటిని పాక్ వాయుసేనకే గర్వకారణమైనవని పేరొందినవీ. ఏమైనా, పాకిస్తాన్ వాయుసేన యొక్క 19వ స్క్వాడ్రన్ను నడిపిన పదవీవిరమిత Air Cdre Sajjad Haider ప్రకారం, F-104 వాటి సామర్థ్యాన్ని ప్రదర్శించలేక పోయాయి. "సహజంగానే భారీ పరిమాణం గల సోవియట్ బాంబర్ల యొక్క 40,000 అడుగల పైనే ఎగరగలవు" కాని ఇవి తక్కువ ఎత్తులో త్వరగా కదిలే యుద్దవిమానాలతో తలపడలేవు."యుద్దప్రదేశంలో ఇది పనికిరాదు". అందుచేత స్టార్ ఫైటర్స్ కు భారత వాయుసేన భయపడింది, కాని తక్కువ వేగం ఉన్నా వేగంగా కలియతిరగగల ఫోలేండ్ గ్నాట్స్ ఉండడంచేత యుద్దంలో భారత వాయుసేనను ఇది ఏమాత్రం ప్రభావితం చేయలేక పోయింది*.

*యుద్దం వల్ల జరిగిన నష్టాలనూ, కోల్పోయిన నహజ వనరులను ఒక నివేదికలో రెండు దేశాలూ పెర్క్కొన్నయి, వీటిని ఆ రెండు దేశాలూ కూడా పరిశీలించుకున్నయి.భారత వాయుసేన తన 35 యుద్దవిమానాలను కోల్పోయి,73 పాక్ యుద్దవిమానాలను కూల్చివేశామని పేర్కొనగా, పాక్ తన 19 యుద్దవిమానాలను కొల్పోగా 104 భారత యుద్దవిమానాలను కూల్చివేసినట్లుగా పేర్కొంది. యుద్దం తరువాత జరిగిన ఒక సైనిక ప్రదర్శనలో పాక్ 86 F-86 సెబ్రెస్, 10 F-104 స్టార్ ఫైటర్స్ మరియూ 20 B-57 కన్బెర్రస్ ను ప్రదర్శించింది. దీంతో భారత్ పెర్కోన్నట్లుగా పాక్ మొదటి వరుస వాయుదళం 73 విమానాలను కుల్చివేయడం నిజంకాదని తెలిసింది*.

*భారత దళాలు దానిని గురించి వివరించాయి, పాక్ వాయుసేన కేవలం ఒక స్క్వాడ్రన్ యుద్దవిమానాలను కోల్పోయిందని తెలిపింది. యుద్దం మొదలు కావడానికి 10 రోజుల ముందు పాకిస్తాన్ ఇండోనేషియా, ఇరాక్, ఇరాన్, టర్కీ, చైనాల నుండి అదనంగా విమానాలను కొనుగోలు చేసింది*.


No comments:

Post a Comment