*🔥చార్లెస్ రాబర్ట్ డార్విన్🔥*
*🔥చార్లెస్
రాబర్ట్ డార్విన్🔥*
*👉(ఫిబ్రవరి
12, 1809 – ఏప్రిల్
19, 1882)*
*🔍ఇంగ్లాండుకు
చెందిన ప్రకృతివాది,
ఇతను,
భూమిపై
జీవజాలము ఏ విధంగా పరిణామక్రమం
చెందినది అనే విషయముపై పరిశోధనలు
చేసి, జీవపరిణామ
సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
అతని
పేరును తలుచుకుంటే చాలు
ఎవరికైనా సరే వెనువెంటనే
గుర్తుకు వచ్చేది పరిణామ
సిద్ధాంతం.
ప్రకృతిలో
జీవజాతులు వేటికవే ఏక కాలంలో
రూపొందినట్లు ఎంతో కాలం నుండి
నమ్ముతూ వస్తున్న ప్రజానీకానికి
- అదంతా
వాస్తవం కాదని ఒక మాతృక నుంచి
సకల జీవరాశులు క్రమానుగతంగా
పరిణామం చెందుతూ ఏర్పడతాయని,
ఈ చర్య
అనంతంగా కొనసాగుతూ ఉంటుందని
మొట్టమొదటి సారిగా వివరించినవాడు
చార్లెస్ డార్విన్ మాత్రమే.
వానరుని
నుంచి నరవానరుడు,
నరవానరుని
నుంచి నరుడు పరిణామ పరంగా
ఉద్భవించాడని తెలిపి సంచలనం
రేపిన ప్రకృతి శాస్త్రవేత్త
చార్లెస్ డార్విన్.*
*🔍బాల్యం-విద్యాభ్యాసం🔎*
*🔬డార్విన్
1809 ఫిబ్రవరి
12న
ఇంగ్లండులోని ష్రూస్బరీలో
జన్మించాడు.
వైద్యుడైన
తండ్రి అన్ని సదుపాయాలూ
సమకూర్చినా చదువులో రాణించలేదు.
అతడొక
మందబుద్ధిగా ఉపాధ్యాయులు
భావించేవారు.
అతను
చిన్ననాటి నుండి కీటకాలను,
ఖనిజాలను
సేకరిస్తూ రసాయనిక శాస్త్రంలో
పరిశోధనలు చేస్తూ ఉండేవాడు.
16 యేండ్ల
వయస్సులో వైద్య విద్యను చదవటం
కోసం ఈయనను ఎడిన్ బర్గ్
విశ్వవిద్యాలయంలో చేర్పించారు.
కాని
మత్తుమందులు లేకుండా చేస్తున్న
ఆపరేషన్లను చూచి,
ఆ
చిత్రహింసకు ఆయన కలత చెంది
వైద్యవిద్యపై మనసు పెట్టి
చదవలేక పోయాడు.
ఏదో ఒక
డిగ్రీ సంపాదించాలనే తండ్రి
కోరికపై కేంబ్రిడ్జ్లో
తత్త్వశాస్త్ర అధ్యయనంలో
చేరినా అక్కడా అంతే.
అక్కడి
ప్రొఫెసర్ ఓసారి అతడికి
'బీగల్'
అనే ఓ
నౌక కెప్టెన్కి పరిచయం
చేశాడు. వివిధ
దేశాల్లో, దీవుల్లో
ఉండే జీవుల పరిశీలనకు అవకాశం
ఉంటుందనే ఆలోచనతో డార్విన్
తన తండ్రి వద్దంటున్నా వినకుండా
ఆ ఓడ ఎక్కేశాడు.
ఆ నౌకాయానంలో
డార్విన్ అనేక ప్రాంతాల్లో
మొక్కలు, రాళ్లు,
శిలాజాలు,
కీటకాలు,
జంతువులను
పరిశీలించి చాలా నమూనాలను
సేకరించి ఇంటికి పంపుతూ
వచ్చాడు. ఆ
పరిశీలనల ఆధారంగానే జీవజాతుల
పరిణామ క్రమంపై పుస్తకం
రాశాడు. 150 సంవత్సరాల
క్రితం రాసిన ఈ గ్రంథం ఇప్పటికీ
ప్రామాణికంగా నిలిచి ఉంది.
జీవుల్ని
ఏదో అతీత శక్తి ఏకకాలంలో
సృష్టించలేదని,
అవి
వివిధ దశల్లో స్వాభావిక ఎంపిక
(natural selection) ద్వారా
పరిణామం చెందాయని డార్విన్
సిద్ధాంతం చెబుతుంది.
ఇది
ఇప్పటి మైక్రోబయాలజీ,
జెనిటిక్స్,
మాలిక్యులర్
బయాలజీలను సంఘటిత పరచడంలోనూ,
డీఎన్ఏ
పరీక్షల్లోనూ ప్రముఖ పాత్ర
వహిస్తోంది.*
*🦠డార్వినిజం🦠*
*🌟చార్లెస్
డార్విన్ ప్రతిపాదించిన
డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం
(Darwin's theory of evolution) భూమి
మీది జీవుల పరిణామ క్రమాన్ని
తెలియజేస్తుంది.
ఆధునిక
జీవ శాస్త్రంలో డార్వినిజం
చాలా మార్పు తెచ్చింది.
మూఢ
నమ్మకాలని విభేదించడంలో కూడా
డార్వినిజం కీలక పాత్ర
పోషించింది.
మనిషి
కోతి నుంచి వచ్చాడు,
మనిషిని
దేవుడు సృష్ఠించలేదన్న
సిద్దాంతాన్ని తెర మీదకు
తెచ్చింది. ఇప్పుడు
కూడా సృష్ఠివాదం పేరుతో
డార్వినిజాన్ని వ్యతిరేకించే
వాళ్ళు ఉన్నారు.
డార్విన్
జీవ పరిణామ సిధ్ధాంతం మార్క్సిస్ట్
చారిత్రక భౌతికవాద రచనలకి
కూడా ఊపిరిపోసింది.
మలేషియా
నుంచి రసెల్ వాలేస్ (1823-
1913) అనే
వ్యక్తి పంపిన సిద్ధాంత వ్యాసం
డార్విన్ వ్యాసం ఒకే విధంగా
ఉన్నాయి.
డార్విన్1844లో
తన రచనను, వాలేస్
పంపిన వ్యాసాన్ని లియన్ సొసైటీ
జర్నల్కు అందచేశాడు.
1858 జూలై
15న
శాస్త్రవేత్తల సమావేశం
జరిగింది. ఇరువురి
వ్యాసాలు పరిశీలించారు.
1844లో
డార్విన్ మొదలు పెట్టగా,
వాలేస్
1858లో
రాశాడు. కనుక
డార్విన్ ముందు రాసినట్టు
నిర్ధారించారు.*
*👉పరిణామ
సిద్ధాంతం*
*🦠జీవజాతుల
మధ్య సంఘర్షణ ఉంటుంది.
సజాతి
సంఘర్షణ, విజాతి
సంఘర్షణ, ప్రకృతిలో
సంఘర్షణ. ఈ
సంఘర్షణలో నెగ్గినవే ప్రకృతి
ఎన్నిక చేసిన సార్థకమ జీవులు.
ఇవే
మనుగడను సాగిస్తాయి.
ఈ జీవులలోని
వైవిద్యాలే తరాలు మారుతూ
పోగా కొత్త జాతుల ఉత్పన్నానికి
మూలాధారాలు అవుతాయి.
ఇది
సంక్షిప్తంగా డార్విన్ పరిణామ
వాదం.అయితే
సృష్టి సిద్ధాంత వాదులు ఈయన
వాదనను సమర్థించరు.
అయితే
బైబిల్ లో చెప్పినట్లు ఏడు
రోజుల లోనే సమస్త సృష్టి,
సకల జీవ
జలాలు రూపొందించబడినాయని
చెబితే మాత్రం నమ్మడం కష్టం.*
*💫అస్తమయం💫*
*✨ఈయన
74 యేండ్ల
వయస్సులో చనిపోయారు.
సర్
ఐజాక్ న్యూటన్ సమాధి దగ్గరే
ఈయన కూడా సమాధి చేయబడటం
కాకతాళీయం.
డార్విన్
ఈనాడు లేకపోయినా ఆయన ప్రతిపాదించిన
ప్రకృతివరన సిద్దాంతం నిలిచే
ఉంటుంది.*
No comments:
Post a Comment