*🔥భారత
రాజ్యాంగం🔥*
*భారతదేశపు
అత్యున్నత చట్టం*
*🔶భారత
రాజ్యాంగం ద్వారా భారత దేశానికి
గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది.
1950 జనవరి
26 న
భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన
తరువాత స్వతంత్ర భారతదేశం
సర్వసత్తాక, ప్రజాస్వామ్య,
గణతంత్ర
రాజ్యంగా అవతరించింది.
ప్రతి
సంవత్సరం ఆ రోజును గణతంత్ర
దినంగా జరుపుకుంటారు.
భారత ప్రభుత్వ
నిర్మాణం ఎలా ఉండాలి,
పరిపాలన
ఎలా జరగాలి అనే విషయాలను
రాజ్యాంగం నిర్దేశించింది.
శాసన వ్యవస్థ,
కార్యనిర్వాహక
వ్యవస్థ, న్యాయ
వ్యవస్థల ఏర్పాటు, ఆయా
వ్యవస్థల అధికారాలు,
బాధ్యతలు,
వాటి మధ్య
సమన్వయం ఎలా ఉండాలో కూడా
నిర్దేశిస్తోంది*
*🔥రాజ్యాంగ
పరిషత్🔥*
*💐భారత
రాజ్యాంగాన్ని తయారు చెయ్యడానికి
ఒక రాజ్యాంగ సభ లేక రాజ్యాంగ
పరిషత్ ను ఏర్పాటు చేసారు.
ఈ సభలో
సభ్యులను పరోక్ష ఎన్నిక ద్వారా
ఎన్నుకున్నారు. సభ్యుల
కూర్పు ఇలా ఉన్నది:*
*రాష్ట్ర
శాసనసభల ద్వారా ఎన్నికైన
సభ్యులు: 292*
*భారత్
సంస్థానాల నుండి ఎన్నికైన
సభ్యులు: 93*
*ఛీఫ్
కమిషనర్ ప్రావిన్సుల ప్రతినిధులు:
4*
*ఈ
విధంగా మొత్తం సభ్యుల సంఖ్య
389 అయింది.
అయితే,
మౌంట్బాటెన్
యొక్క జూన్ 1947 నాటి
దేశ విభజన ప్రణాళిక కారణంగా
ఈ సభ్యుల సంఖ్య 299కి
తగ్గిపోయింది. రాజ్యాంగ
సభ మొదటి సమావేశం ఢిల్లీలో
ఇప్పటి పార్లమెంటు భవనపు
సెంట్రల్ హాలులో 1946,
డిసెంబర్
9 న
జరిగింది. మొత్తం
211 మంది
సభ్యులు ఈ సమావేశానికి
హాజరయ్యారు. అందులో
9 మంది
మహిళలు. డా.సచ్చిదానంద
సిన్హాను సభకు అధ్యక్షునిగా
ఎన్నుకున్నారు. జవహర్లాల్
నెహ్రూ, మౌలానా
అబుల్ కలాం ఆజాద్, సర్దార్
పటేల్, ఆచార్య
జె.బి.కృపలానీ,
డా.రాజేంద్ర
ప్రసాద్, సరోజినీ
నాయుడు, రాజాజీ,
బి.ఆర్.అంబేద్కర్,
టంగుటూరి
ప్రకాశం పంతులు, పట్టాభి
సీతారామయ్య మొదలైన వారు ఈ
సభలో సభ్యులు*.
*1947
ఆగష్టు 14
రాత్రి
రాజ్యాంగ సభ సమావేశమై,
కచ్చితంగా
అర్ధరాత్రి సమయానికి స్వతంత్ర
భారత శాసన సభగా అవతరించింది.
రాజ్యాంగం
రాతప్రతిని తయారు చెయ్యడం
కొరకు 1947 ఆగష్టు
29 న
రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్టు
కమిటీని ఏర్పాటు చేసింది.
డా.బి.ఆర్.అంబేద్కర్
ఈ కమిటీకి అధ్యక్షుడు*
*🔥రాజ్యాంగ
సభ విశేషాలు🔥*
*స్వతంత్ర
భారత రాజ్యాంగ నిర్మాణానికి
రాజ్యాంగ సభకు పట్టిన కాలం:
2 సంవత్సరాల,
11 నెలల,
18 రోజులు*.
*రాజ్యాంగ
సభ 11 సార్లు,
165 రోజుల
పాటు సమావేశమైంది. ఇందులో
114 రోజులు
రాజ్యాంగం రాతప్రతిపై
వెచ్చించింది*.
*రాజ్యాంగ
రాతప్రతిని తయారుచేసే క్రమంలో
రాజ్యాంగ సభ ముందుకు 7,635
సవరణ
ప్రతిపాదనలు వచ్చాయి*.
*వీటిలో
2,473 ప్రతిపాదనలను
పరిశీలించి, చర్చించి,
పరిష్కరించింది*.
*భారత
రాజ్యాంగాన్ని 1949 నవంబర్
26న
సభలో ఆమోదించారు. 1950 జనవరి
24న
సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు
పెట్టారు. మొత్తం
284 మంది
సభ్యులు సంతకాలు చేసారు*.
*రాజ్యాంగంపై
సంతకాలు చేసే రోజున బయట
చిరుజల్లు పడుతూ ఉంది.
దీన్ని
శుభశకునంగా భావించారు*.
*1950
జనవరి 26న
భారత రాజ్యాంగం అమల్లోకి
వచ్చింది. ఆ
రోజున రాజ్యాంగ సభ రద్దయి,
భారత్
తాత్కాలిక పార్లమెంటుగా
మారింది*. *1952లో
జరిగిన మొదటి సాధారణ ఎన్నికల
తరువాత కొత్త పార్లమెంటు
ఏర్పడే వరకు ఈ తాత్కాలిక
పార్లమెంటు ఉనికిలో ఉంది*.
*🔥రాజ్యాంగ
విశేషాలు🔥*
*🔷భారత
రాజ్యాంగం ప్రపంచంలోని అతి
పెద్ద లిఖిత రాజ్యాంగాలలో
ఒకటి. అవతారిక,
448 అధికరణాలు,
12 షెడ్యూళ్ళతో
కూడిన గ్రంథం ఇది. రాజ్యాంగం
భారత ప్రభుత్వ వ్యవస్థ,
రాష్ట్రాలు,
రాష్ట్రాల
నిర్మాణం, కేంద్ర
రాష్ట్ర సంబంధాలు, కేంద్ర
రాష్ట్రాల విధులు,
అధికారాలు,
స్థానిక
సంస్థలు, ఎన్నికలు
మొదలైన విషయాలను నిర్వచించింది.
పౌరులకు,
భారత రాజకీయ
వ్యవస్థకు సంబంధించి కింది
వాటిని సూత్రీకరించింది:*
*ప్రజలందరికీ
స్వేచ్ఛ, సమానత్వం,
సౌభ్రాతృత్వం*
*పార్లమెంటరీ
ప్రజాస్వామ్య వ్యవస్థ*
*బలమైన
కేంద్రంతో కూడిన సమాఖ్య
వ్యవస్థ*
*ప్రాథమిక
విధులు*
*భారత
రాజ్యాంగం - ప్రాథమిక
హక్కులు*
*ఆదేశ
సూత్రాలు*
*ద్విసభా
విధానం*
*భాషలు
languages*
*వెనుకబడిన
సామాజిక వర్గాలు*
*అవసరమైనపుడు*
*రాజ్యాంగాన్ని
సవరించుకోడానికి వెసులుబాటు
కలిగిస్తూ, సవరణ
విధానాన్ని కూడా నిర్దేశించింది*.
No comments:
Post a Comment