Friday, April 10, 2020

స్వాతంత్ర్యము, 1947 - 1950 మధ్య పరిణామాలు

*🔥స్వాతంత్ర్యము, 1947 - 1950 మధ్య పరిణామాలు🔥



*🔷చివరి బ్రిటీష్ గవర్నర్ జనరలైన విస్కౌట్ లుయీస్ మౌంట్బాటెన్ 1947 జూన్ 3 న బ్రిటీష్ ఇండియాని లౌకిక భారత దేశంగాను, ఇస్లామిక్ పాకిస్తాన్ గాను విభజిస్తున్నట్లు ప్రకటించారు. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్, 1947 ఆగస్టు 15 న భారత దేశం స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. స్వాతంత్ర్యానంతరం హిందూ ముస్లిం ల మధ్య తీవ్ర మతఘర్షణలు తలెత్తాయి. అప్పటి భారత ప్రధాని నెహ్రూ, ఉపప్రధాని వల్లభాయ్ పటేల మౌంట్బాటెన్ ని గవర్నర్ జనరల్ గా కొనసాగవలసిందిగా కోరారు. 1948 లో అయన స్థానంలో చక్రవర్తి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ గా నియమితులైనారు. 565 సంస్థానాలని భారతదేశంలో విలీనం చేసే బాధ్యతను పటేల్ స్వీకరించారు. ఆయన తన ఉక్కు సంకల్పం నిజాయితీలతో కూడిన విధానాలతో ఏకీకరణ సాధించారు. బలప్రయోగంతో జూనాఘడ్, జమ్మూ-కాశ్మీర్, హైదరాబాద్ ఆపరేషన్ పోలో సంస్థానాల విలీనాలు ఆయన ఉక్కు సంకల్పానికి మచ్చుతునకలు*.

*🔶1949 నవంబరు 26 లో రజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనను పూర్తిచేసింది. 1950 జనవరి 26 వ భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది.రాజ్యాంగ పరిషత్ డా| రాజేధ్ర ప్రసాద్ ని ప్రథమ రాష్ట్రపతికా ఎన్నుకోవటంతో ఆయన రాజగోపాలా చారినుండి బధ్యతలు స్వీకరించారు. స్వతంత్ర సర్వసత్తాక భారతదేశంలో గోవా 1961, పాండిచ్చేరి 1953-54, సిక్కింలు 1975 లో విలీనమయ్యాయి. 1952 లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో 62 శాతం పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు*.


No comments:

Post a Comment