Saturday, April 11, 2020

ప్రజాస్వామ్య సూచీలో భారత్‌కు 51వ స్థానం

*📝ప్రజాస్వామ్య సూచీలో భారత్‌కు 51వ స్థానం📝*



🍁2018తో పోలిస్తే 2019లో భారత్ పది స్థానాలు దిగజారింది. దేశంలో పౌర హక్కులు హరించుకుపోతుండటమే ఇందుకు కారణమని ఈఐయూ వివరించింది. ప్రపంచంలోని 165 స్వతంత్ర దేశాలు, 2 స్వతంత్ర ప్రాంతాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ అమలు తీరుపై ఈఐయూ ఈ అంచనాలను రూపొందించింది. 2018లో ప్రజాస్వామ్య సూచీలో ఈఐయూ భారత్‌కు 7.23 పాయింట్లు ఇవ్వగా 2019కు వచ్చేసరికి 6.90 పాయింట్లు మాత్రమే కేటాయించిందిభారత్‌లో బలహీన ప్రజాస్వామ్యం..ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, ప్రభుత్వం పనిచేసే విధానం, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌర హక్కులు.. అనే అంశాల ఆధారంగా ఈ ఇండెక్స్‌ను ఈఐయూ రూపొందించింది. ఈ అంశాల్లో వచ్చిన పాయింట్ల ఆధారంగా ఆయా దేశాలను సంపూర్ణ ప్రజాస్వామ్యం (8 కంటే ఎక్కువ పాయింట్లు), బలహీన ప్రజాస్వామ్యం(6 పాయింట్ల కంటే ఎక్కువ.. 8 లేదా అంతకంటే తక్కువ), మిశ్రమ పాలన (4 కంటే ఎక్కువ, 6 కంటే తక్కువ), నియంతృత్వం (4 లేదా అంతకంటే తక్కువ పాయింట్లు). ఇందులో 8 కంటే తక్కువ 6 కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన భారత్‌లో బలహీన ప్రజాస్వామ్యం ఉందని తేల్చింది.

ఈఐయూ ప్రపంచ ప్రజాస్వామ్య సూచీ-2019ర్యాంకుదేశం1నార్వే2ఐస్‌ల్యాండ్3స్వీడన్4న్యూజిలాండ్5ఫిన్‌లాండ్51భారత్52బ్రెజిల్69శ్రీలంక80బంగ్లాదేశ్108పాకిస్థాన్134రష్యా153చైనా163చాద్164సిరియా165సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్166రిపబ్లిక్ ఆఫ్ కాంగో167ఉత్తరకొరియా


No comments:

Post a Comment