Saturday, April 11, 2020
ప్రజాస్వామ్య సూచీలో భారత్కు 51వ స్థానం
🍁2018తో
పోలిస్తే 2019లో
భారత్ పది స్థానాలు దిగజారింది.
దేశంలో
పౌర హక్కులు హరించుకుపోతుండటమే
ఇందుకు కారణమని ఈఐయూ వివరించింది.
ప్రపంచంలోని
165 స్వతంత్ర
దేశాలు, 2 స్వతంత్ర
ప్రాంతాల్లో ప్రజాస్వామ్య
వ్యవస్థ అమలు తీరుపై ఈఐయూ ఈ
అంచనాలను రూపొందించింది.
2018లో
ప్రజాస్వామ్య సూచీలో ఈఐయూ
భారత్కు 7.23
పాయింట్లు
ఇవ్వగా 2019కు
వచ్చేసరికి 6.90
పాయింట్లు
మాత్రమే కేటాయించింది. భారత్లో
బలహీన ప్రజాస్వామ్యం..ఎన్నికల
ప్రక్రియ, బహుళత్వం,
ప్రభుత్వం
పనిచేసే విధానం,
రాజకీయ
భాగస్వామ్యం,
రాజకీయ
సంస్కృతి, పౌర
హక్కులు.. అనే
అంశాల ఆధారంగా ఈ ఇండెక్స్ను
ఈఐయూ రూపొందించింది.
ఈ అంశాల్లో
వచ్చిన పాయింట్ల ఆధారంగా ఆయా
దేశాలను సంపూర్ణ ప్రజాస్వామ్యం
(8 కంటే
ఎక్కువ పాయింట్లు),
బలహీన
ప్రజాస్వామ్యం(6
పాయింట్ల
కంటే ఎక్కువ.. 8
లేదా
అంతకంటే తక్కువ),
మిశ్రమ
పాలన (4 కంటే
ఎక్కువ, 6 కంటే
తక్కువ), నియంతృత్వం
(4 లేదా
అంతకంటే తక్కువ పాయింట్లు).
ఇందులో
8 కంటే
తక్కువ 6 కంటే
ఎక్కువ పాయింట్లు సాధించిన
భారత్లో బలహీన ప్రజాస్వామ్యం
ఉందని తేల్చింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment