భారత సైనిక దళం
*🔥భారత
సైనిక దళం🔥*
*💐భారత
రక్షణ వ్యవస్థలో ఒకటయిన భారత
సైనిక దళం (ఇండియన్
ఆర్మీ) ప్రధాన
కర్తవ్యం భూభాగాన్ని
పరిరక్షించడంతో పాటు దేశంలో
శాంతి భద్రతలను కాపాడుతూ
సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం.
ప్రస్తుత
భారత ఆర్మీలో మొత్తం సుమారు
25 లక్షల
మంది ఉన్నారు. ఇందులో
12 లక్షల
మంది రిజర్వ్ సైన్యం,
అనగా ఈ
సైన్యం అవసరమయినపుడు మాత్రమే
రంగంలోకి దిగుతుంది.
కొన్ని
దేశాలో ఉన్న ప్రతి యువకుడు
తప్పనిసరిగా ఆర్మీలో పని
చేయాలన్న నియమం భారత దేశంలో
లేదు. స్వచ్ఛందంగా
ఆసక్తికలవారు మాత్రమే ఆర్మీలో
చేరవచ్చు. ఐక్యరాజ్య
సమితి చేపట్టిన ఎన్నో
కార్యకలాపాలలో, ముఖ్యముగా
శాంతి పరిరక్షణలో భారత సైనిక
దళం పాలు పంచుకొంది*.
*🔥చరిత్ర🔥*
*🖊️1947లో
స్వాతంత్ర్యం వచ్చినపుడు
అప్పటివరకు ఉన్న బ్రిటీష్
ఇండియన్ ఆర్మీని భారత్,
పాకిస్తాన్ల
కోసం రెండు భాగాలు చేసారు.
అప్పుడే
భారత సైన్యానికి "ఇండియన్
ఆర్మీ" అని
పేరు పెట్టబడింది*
*🔥మొదటి
కాశ్మీర్ యుద్ధం🔥*
*🏮స్వాతంత్ర్యం
వచ్చిన తర్వాత స్వతంత్ర
రాజ్యమయిన కాశ్మీర్ను
పాలిస్తున్న మహారాజు ఇటు
భారత దేశంలో లేదా అటు పాకిస్తాన్లో
విలీనానికి అంగీకరించలేదు.
కొద్ది
రోజులకు పాకిస్తాన్ చొరబాటుదారులను
కాశ్మీరుకు పంపి ఊళ్ళను
ఆక్రమించుకోసాగింది.
మరి
కొద్దిరోజులను తన సైన్యాన్ని
పంపి కాశ్మీరును ఆక్రమించుకోవడానికి
ప్రయత్నిస్తున్నపుడు మహారాజు
భారత ప్రభుత్వాన్ని శరణు
కోరి భారత దేశంలో కాశ్మీర్ను
విలీనం చేయడానికి అంగీకరించి
ఒప్పందం చేసాడు. అప్పుడు
భారత ప్రభుత్వం జనరల్ తిమ్మయ్య
నేతృత్వంలో సైన్యాన్ని wపంపి
పాకిస్తాన్ సైన్యాన్ని
కాశ్మీర్నుండి వెళ్ళగొట్టసాగింది.
ఆ సమయంలో
ఐక్యరాజ్య సమితి రెండు దేశాల
మధ్య శాంతి చర్చలు ప్రారంభించి
సరిహద్దు రేఖను నిర్ణయించడంతో
వివాదానికి తెరపడింది*.
గోవా,
డామన్-డయ్యు
ఆపరేషన్ సవరించుబ్రిటీష్,
ఫ్రెంచ్
సైన్యాలు భారతదేశాన్ని విడిచి
వెళ్ళినా, పోర్చుగీసు
సైన్యం విడిచి వెళ్ళక గోవా,
డామన్
డయ్యులను తన ఆధీనంలో ఉంచుకున్నది.
పోర్చుగీస్
అధికారులు చర్చలకు అంగీకరించకపోవడంతో
భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్
పేరుతో సైన్యాన్ని పంపింది.
భారత
సైన్యాన్ని తట్టుకొనలేక
పోర్చుగల్ దేశం భారతదేశంతో
సంధికి ఒప్పుకొని అన్ని
ప్రాంతాలను విడిచి వెళ్ళేందుకు
అంగీకరించింది.
భారత్
పాక్ యుద్దం 1965
*💐1965
యుద్ధంలో
ముందుకు వెళ్తున్న భారత యుద్ధ
ట్యాంకులు*
*చైనాతో
జరిగిన యుద్ధంలో ఓడిపోయిన
భారత్ మరో యుద్ధానికి సిద్దం
కాలేదు, కాశ్మీర్
ప్రజలు పాకిస్తానుకు మద్దతు
ఇస్తారు అన్న అపోహలతో 1965లో*
*పాకిస్తాన్
అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తన
సైన్యాన్ని పంపి కాశ్మీర్ను
ఆక్రమించుకున్నాడు.
రెండవ
ప్రపంచ యుద్ధం తర్వాత ఈ
యుద్ధంలోనే అత్యధికంగా యుద్ధ
ట్యాంకులను ఉపయోగించారు.
భారత ఆర్మీ
హోరాహోరీగా పోరాడి అందుబాటులో
ఉన్న యుద్ధం ట్యాంకులన్నీ
వినియోగించి పాక్ సైన్యాన్ని
ముప్పుతిప్పలు పెట్టింది.
భారత్ 128
ట్యాంకులను
నష్టపోయింది*. *150 పాక్
ట్యాంకులను ధ్వంసం చేసి 152
ట్యాంకులను
చేజిక్కించుకొంది.
తాష్కెంట్లో
లాల్ బహదూర్ శాస్త్రి -
అయూబ్
ఖాన్ల మధ్య జరిగిన సంధితో
ఈ యుద్ధం ముగిసింది*.
*🔥భారత్
పాక్ యుద్దం 1971🔥*
*✳️1971లో
తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత
బంగ్లాదేశ్) లో
జరిగిన తిరుగుబాటుతో దాదాపు
కోటి మంది శరణార్థులు భారతదేశాని
రావడంతో భారత్-పాక్
యుద్ధం మొదలయింది. తూర్పు
పాకిస్తాన్కు పశ్చిమ పాకిస్తాన్
నుండి విమోచన కల్పించడం
భారత్కు అన్ని విధాలా
శ్రేయస్కరమయింది. తన
బలగాలన్నిటినీ పశ్చిమ పాకిస్తాన్
(ప్రస్తుత
పాకిస్తాన్) వైపే
గురి పెట్టగలిగింది.
భారత సైన్యం
జనరల్ అరోరా నేతృత్వంలో పాక్
సైన్యాన్ని లాహోర్ వరకు తరిమి
కొట్టి 90,000 యుద్ధ
ఖైదీలను పట్టుకొంది.
పాక్ ఓటమిని
అంగీకరించడంతో ఈ యుద్ధం
ముగిసింది*.
*🔥కార్గిల్
యుద్ధం🔥*
*🎍ప్రతికూల
వాతావరణ పరిస్థితుల వల్ల
భారత్ తన సైన్యాన్ని కొన్ని
హిమాలయ ప్రాంతాల్లో నుండి
వెనక్కు రప్పించిన కొద్ది
రోజులకు 1999లో
పాకిస్తాన్ తన సైన్యాన్ని
పంపి తీవ్రవాదులతో కలసి ఆ
ప్రాంతాలు ఆక్రమించుకుంది.
నెమ్మదిగా
కీలకమయిన బటాలిక్, ద్రాస్
మరియు టైగర్ హిల్లను
ఆక్రమించుకోవడంతో భారత్
2,00,000 మంది
సైన్యాన్ని సిద్దం చేసింది.
కార్గిల్
యుద్ధం జరుగుతున్న ప్రాంతాలకున్న
పరిమితులవల్ల 30,000 మంది
మాత్రమే పాల్గొన్నారు.
సైన్యం
అనేక కీలక పర్వతాలలో,
చెక్ పోస్టుల
వద్ద ఉన్న తీవ్రవాదులను
సమర్థవంతంగా ఎదుర్కొని రెండు
నెలల్లో అన్నింటినీ స్వాధీనం
చేసుకుంది*.
*🔥వర్గీకరణ🔥*
*డివిజన్:
మేజర్ జనరల్
ఆధ్వర్యం వహించే ప్రతి
డివిజన్లో 15,000 మంది
యుద్ధవిద్యల్లో ఆరితేరినవారు,
8,000 వారికి
సహాయకులు ఉంటారు. ప్రస్తుతం
ఆర్మీలో 34 డివిజన్లు
ఉన్నాయి. ప్రతి
డివిజన్లో కొన్ని బ్రిగేడ్లు
ఉంటాయి*.
*బ్రిగేడ్:
ప్రతి
బ్రిగేడ్లో 4,000-5,000 మంది
సైనికులు ఉంటారు. బ్రిగేడ్
అధికారిని బ్రిగేడియర్ అని
పిలుస్తారు. ప్రతి
బ్రిగేడ్లో కొన్ని బెటాలియన్లు
ఉంటాయి*
*బెటాలియన్:
కల్నల్
ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించే
ప్రతి బెటాలియన్లో 900
కంటే
ఎక్కువమంది సైనికులు
పనిచేస్తుంటారు*.
*కంపెనీ:
మేజర్
ఆధ్వర్యంలో పనిచేసే కంపెనీలో
120 సైనికులు
ఉంటారు*.
*ప్లటూన్:
32 మంది
సైనికులు కల దీనికి లెఫ్ట్నెంట్
అధికారి*.
*సెక్షన్:
హవల్దార్
లేదా సార్జంట్ నాయకత్వం వహించే
సెక్షన్లో 10 మంది
సైనికులు ఉంటారు*.
ప్రస్తుత
ఆర్మీలోని కొన్ని విభాగాలు:
4
రాపిడ్
డివిజన్లు18
ఇన్ఫాంట్రీ
డివిజన్లు10
మౌంటైన్
డివిజన్లు2
ఫిరంగి
డివిజన్లు6 ఎయిర్
డిఫెన్స్ బ్రిగేడులు1
పేరాచూట్
బ్రిగేడ్4
ఇంజనీర్
బ్రిగేడులు14
హెలికాప్టర్
యూనిట్లు63
ట్యాంక్
రెజిమెంట్లు200
ఫిరంగి
రెజిమెంట్లు
*🔥యుద్ధ
ట్యాంకులు🔥*
*అర్జున్
MBT*
*పూర్తి
స్వదేశీ పరిజ్ఞానంతో DRDO
తయారు చేసిన
ట్యాంకు ఇది. మహాభారతంలో
వీరుడయిన అర్జునుడి పేరు
దీనికి పెట్టబడింది.
చెన్నై
వద్దనున్న ఆవడిలో భారత
ప్రభుతానికి చెందిన భారీ
వాహనాలను నిర్మించే ఫ్యాక్టరీలో
ఈ ట్యాంకుకు సంబంధించిన
పరికరాలు తయారు చేస్తారు.
మొత్తం
లక్ష్యంగా పెట్టుకున్న 124
ట్యాంకుల్లో
ఇప్పటికే 15 ట్యాంకుల
నిర్మాణం పూర్తి అయి ఆర్మీ
వాటిని వినియోగిస్తున్నది.
మిగిలిన
109 నాలుగేళ్ళలో
ఆర్మీలో పూర్తిస్థాయిలో
పాల్గొంటాయి. దీని
విలువ: 14 కోట్ల
రూపాయలు. బరువు:
58.5 టన్నులు.
పొడవు:
10.638. సిబ్బంది:
4. వేగం:
72 కిమీ/గం*
*T-90
భీష్మ*
*అర్జున
ట్యాంకుల నిర్మాణంలో జాప్యం
జరగడం, నిర్మాణంలో
ఉన్న T-72 ట్యాంకుల
నిర్మాణానికి T-90 ట్యాంకుల
నిర్మాణం ఉపయోగకరంగా ఉండడం,
అప్పటికే
పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటున్న
T-80 ట్యాంకులకు
సరిసమానయిన ట్యాంకులను
సమకూర్చుకోవడం మొదలయిన కారణాల
వల్ల 2001 రష్యా
నుండి 310 ట్యాంకులను
కొనుగోలు చేసారు. 2006లో
మరో 1,000 ట్యాంకులను
స్వదేశంలో తయారు చేయవలసినదిగా
రక్షణశాఖ 10,000 కోట్ల
రూపాయల ఆర్డరును ఇచ్చింది.
2 కి.మీ.
దూరంలోని
లక్ష్యాన్ని ఛేదించగల ఈ
ట్యాంకులో నిమిషానికి 210
రౌండ్లను
ప్రయోగించగల సదుపాయమున్నది.
దీని*
*బరువు:
46.5 టన్నులు.
పొడవు:
9.54 మీటర్లు*.
*సిబ్బంది:
3. వేగం:
65 కిమీ/గం*
*🔥క్షిపణులు🔥*
*ఆకాశ్*
*ఉపరితలం
నుండి గాలిలోకి ప్రయోగించగలిగే
ఆకాశ్ మిస్సైల్ పూర్తి స్వదేశీ
పరిజ్ఞానంతో నిర్మింపబడింది.
ఇది తాను
ఉన్న చోటినుండి 30 కిమీ
దూరంలో ఉన్నవాటిని నిరోధించగలదు.
దీని బరువు
720 కేజీలు,
పొడవు 5.8
మీటర్లు.
DRDO తయారు
చేసిన ఆకాశ్ మిస్సైళ్ళను
భారత ఆర్మీ డిసెంబరు 2007లో
పరీక్షించింది. పదిరోజులపాటు
జరిగిన ఈ పరీక్షలలో అన్నిసార్లూ
ఈ క్షిపణి లక్ష్యాన్ని
ఛేదించింది. ఈ
క్షిపణి శక్తి తెలుసుకొన్న
మలేషియా ఇవి కొనుగోలు చేయుటకు
ఆసక్తి చూపుతున్నది*.
*బ్రహ్మోస్*
*ఇది
భారత్-రష్యాలు
సమ్యుక్తంగా నిర్మించిన
క్షిపణి. భారతీయ
నది అయిన బ్రహ్మపుత్ర,
రష్యా నది
అయిన మొస్క్వా ల పేర్లను కలిపి
బ్రహ్మోస్ అని పేరు పెట్టారు.
290 కి.మీ.
దూరంలోపు
10 మీటర్ల
ఎత్తులో ఎగురుతున్న వాటిని
కూడా ఈ క్షిపణి ధ్వంసం చేయగలదు.
రాబోవు
పదేళ్ళలో మరో 1,000 బ్రహ్మోస్
సూపర్సానిక్ మిస్సైళ్ళను
నిర్మించడానికి భారత రక్షణ
శాఖ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది*.
*పృథ్వి*
*పృథ్వి
క్షిపణి పూర్తిగా స్వదేశీ
సాంకేతిక పరిజ్ఞానంతో
నిర్మించబడిన మొట్ట మొదటి
క్షిపణి. 1983లో
మొదలు పెట్టిన ఈ క్షిపణి
నిర్మాణం 1988లో
పూర్తయింది. ఇది
150-300 కి.మీ.
దూరంలోని
లక్ష్యాలను ఛేదించగలదు*.
*అగ్ని*
*కార్గిల్
యుద్ధం తర్వాత పాకిస్తాన్ను
దృష్టిలో పెట్టుకొని కేవలం
18 నెలల్లో
DRDO అగ్ని
క్షిపణిని తయారు చేసింది.
ప్రస్తుతం
ఇందులో మూడు రకాల క్షిపణులు
ఉన్నాయి*.
అగ్ని
1: పొడవు
- 15 మీ.
పరిధి -
850 కి.మీ.
అగ్ని
2: పొడవు
- 20 మీ
పరిధి - 3300-4800 కి.మీ.
అగ్ని
3: పొడవు
- 15 మీ
పరిధి - 3500-5500 కి.మీ
No comments:
Post a Comment