స్వతంత్ర భారతదేశం (1947 - 1977)
స్వతంత్ర
భారతదేశం (1947 -
1977)
1.
భారత
ప్రజాస్వామ్యాన్ని అత్యవసర
పరిస్థితి ఏ విధంగా వెనక్కి
తీసుకెళ్లింది?జ:
* శాంతిని
కాపాడాలనే పేరుతో అత్యవసర
పరిస్థితిలో ప్రభుత్వం ప్రజల
హక్కులకు నష్టం కలిగించే
అనేక చట్టాలను తీసుకువచ్చింది.*
ప్రాథమిక
హక్కులను నిలిపివేశారు.*
కారణం
లేకుండా అరెస్టులు,
అకారణంగా
హింసించడం లాంటి అనేక సంఘటనలు
జరిగాయి.*
ఈ సమయంలో
ధరల నియంత్రణ,
నల్లబజారు,
వెట్టిచాకిరీలకు
వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలకు
ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు
ఇచ్చారు.*
కుటుంబ
నియంత్రణ పేరుతో బలవంతంగా
అపరేషన్లను చేయించారు.*
మురికివాడల
తొలగింపు ప్రజలకు ఆగ్రహం
తెప్పించింది.*
అత్యవసర
పరిస్థితిలో అనేక ప్రజా
వ్యతిరేక కార్యకలాపాలకు
ప్రభుత్వం పాల్పడింది.*
ప్రజల్లో
ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం
తగ్గే విధంగా వారి చర్యలు
ఉన్నాయి.2.
స్వాతంత్య్రం
వచ్చిన తొలి సంవత్సరాల్లో
సామాజిక, ఆర్థిక
మార్పు తీసుకురావడానికి ఏ
చర్యలు చేపట్టారు?జ:
* స్వాతంత్య్రం
వచ్చిన తొలి సంవత్సరాల్లో
నెహ్రూ ప్రభుత్వం కింది
చర్యలను చేపట్టింది.
భూ
సంస్కరణలు, వ్యవసాయ
సహకార సంఘాలు,
స్థానిక
స్వపరిపాలన.*
భూసంస్కరణలు:
జమీందారీ
వ్యవస్థ రద్దు,
కౌలు
విధానాల్లో సంస్కరణలు,
భూపరిమితి.*
వ్యవసాయ
సహకార సంఘాలు:
రుణవసతిని
వ్యవసాయానికి ఇవ్వడమే కాకుండా
తక్కువ ధరకు రసాయనాలు,
ఎరువులు,
విత్తనాలను
రైతులకు అందించడం.*
స్థానిక
స్వపరిపాలన:
భూసంస్కరణలు,
సహకార
సంఘాలు అమలయ్యేలా చూడటం.
No comments:
Post a Comment