*🔥భారతదేశ చరిత్ర🔥*
*💐భారతదేశ
చరిత్ర" లో
భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ
స్థావరాలు, సమాజాలు
భాగంగా ఉన్నాయి. సింధు
నాగరికత నుండి వేదసంస్కృతి
రూపొందించిన ఇండో-ఆర్యన్
సంస్కృతి ఏర్పరచింది.[1]
హిందూయిజం,
జైనమతం,
బౌద్ధమతం
[2][3] అభివృద్ధి,
హిందూ
శక్తులతో ముడిపడిన మధ్యయుగ
కాలంలో ముస్లింల ఆక్రమణల
పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని
వివిధ భౌగోళిక ప్రాంతాల్లో
మూడు వందల సంవత్సరాల పాటు
రాజవంశాలు సామ్రాజ్యాలు;[4][5]
యూరోపియన్
వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల
ఆగమనం, బ్రిటీష్
ఇండియా; భారత
స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ
విభజనకు దారితీసి భారత గణతంత్రం
ఏర్పడింది*
*🥀భారతీయ
ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి
చెందిన ఆధునిక మానవుల పురాతత్వ
ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల[7]
నాటిదిగా
అంచనా వేయబడింది. సుమారుగా
5,00,000 సంవత్సరాల
క్రితం నాటి ప్రారంభ మానవులకు
సంబంధించిన కొన్ని ఆధారాలు
ఉన్నాయి.[8][9] దీన్ని
"నాగరికతకు
ఉయ్యాల" గా
భావిస్తున్నారు.[10] దక్షిణ
ఆసియాలోని మొదటి అతిపెద్ద
నాగరికత అయిన సింధు లోయ నాగరిక
3300 నుండి
1300 వరకు
భారత ఉపఖండంలోని ఉత్తర-పశ్చిమ
భాగంలో వ్యాప్తి చెందింది.[11]
క్రీ.పూ
2600 నుండి
1900 వరకు
ప్రౌఢ హరప్పా కాలంలో ఆధునిక,
సాంకేతిక
అధునాతన పట్టణ సంస్కృతి
అభివృద్ధి చెందింది.[12]
ఈ నాగరికత
క్రీ.పూ.
రెండవ
సహస్రాబ్ధి ప్రారంభంలో
పతనమైంది. తరువాత
ఇనుప యుగం వేద సంస్కృతి
కొనసాగింది. ఈ
కాలం హిందూమత పవిత్ర గ్రంథాలైన
వేదాల కూర్పును చూసింది.
ఇది జనపదాలకు
(రాచరిక,
రాజ్య-స్థాయి
విధానాలు) కులాల
ఆధారంగా సామాజిక విభజనకు
అనుసంధానించబడింది.
తరువాత
వేద నాగరికత ఇండో-గంగాటిక్
మైదానానికి వరకు అలాగే భారత
ఉపఖండంలో చాలా వరకు విస్తరించింది.
అలాగే
మహాజనపదాలు అని పిలవబడే ప్రధాన
రాజకీయాల పెరుగుదలను చూసింది.
ఈ సామ్రాజ్యాలలో
ఒకటైన మగధ, గౌతమ
బుద్ధుడు, మహావీరుడు
క్రీ.పూ.
5 వ,
6 వ శతాబ్దాలలో
వారి ధారావాహిక తత్వాలు
ప్రచారం చేశారు*.
*🥀క్రీ.పూ
4 వ -
3 వ శతాబ్దాలలో
భారతీయ ఉపఖండంలో అధిక భాగాన్ని
మౌర్య సామ్రాజ్యం స్వాధీనం
చేసుకుంది. క్రీ.పూ.
3 వ శతాబ్దం
నుండి ఉత్తరాన ప్రాకృత,
పాలి
సాహిత్యం, దక్షిణ
భారతదేశంలో తమిళ సంగం సాహిత్యం
వృద్ధి చెందాయి. 3 వ
శతాబ్దంలో వూట్జ్ స్టీల్
దక్షిణ భారతదేశంలో ఉద్భవించి
విదేశాలకు ఎగుమతి చేయబడింది.
సాంప్రదాయ
కాలములో భారతదేశంలోని వివిధ
ప్రాంతాలను తరువాతి 1,500
సంవత్సరముల
వరకు అనేక రాజవంశాలు పాలించాయి.
వాటిలో
గుప్త సామ్రాజ్యం అగ్రస్థానంలో
నిలిచింది. ఈ
కాలాన్ని హిందూ మతానికి,
మేధాసంపత్తి
పునరుద్ధరణకు సాక్ష్యంగా
చెప్పవచ్చు. దీనిని
"భారతదేశం
శాస్త్రీయ" లేదా
" స్వర్ణ
యుగం " అని
వర్ణిస్తారు. ఈ
కాలంలో భారతీయ నాగరికత,
పరిపాలన,
సంస్కృతి,
మతం (హిందూమతం,
బౌద్ధమతం)
అంశాలు
ఆసియాలో చాలా వరకు వ్యాపించాయి.
అయితే
దక్షిణ భారతదేశంలోని రాజ్యాలు
మధ్యప్రాచ్య, మధ్యధరా
ప్రాంతాలతో సముద్ర సంబంధ
వ్యాపార సంబంధాలు కలిగి
ఉన్నాయి. ఆగ్నేయాసియాలోని
పలు ప్రాంతాల్లో భారతీయ
సాంస్కృతిక ప్రభావం విస్తరించింది.
ఇది ఆగ్నేయ
ఆసియాలో (గ్రేటర్
ఇండియా) భారతదేశ
రాజ్యాలను స్థాపించడానికి
దారితీసింది*
*🥀7
- 11 వ శతాబ్దాల
మధ్య కన్నౌజ్ కేంద్రంగా ఉన్న
త్రిపాఠి పోరాటం అత్యంత
ముఖ్యమైన సంఘటనగా భావించబడుతుంది.
ఇది పాల
సామ్రాజ్యం, రాష్ట్రకూట
సామ్రాజ్యం, గురురా-ప్రతీహరా
సామ్రాజ్యం మధ్య రెండు శతాబ్దాల
వరకు కొనసాగింది. దక్షిణ
భారతదేశం 5 వ
శతాబ్దం మధ్యకాలంలో బహుళ
సామ్రాజ్య శక్తుల అభివృద్ధిని
చూసింది. వీటిలో
చాళుక్య, చోళ,
పల్లవ,
చేరా,
పాండ్యన్,
పశ్చిమ
చాళుక్య సామ్రాజ్యాలు చాలా
ముఖ్యమైనవి. 11 వ
శతాబ్దంలో చోళ రాజవంశం దక్షిణ
భారతదేశాన్ని జయించి విజయవంతంగా
ఆగ్నేయ ఆసియా, శ్రీలంక,
మాల్దీవులు,
బెంగాల్
ప్రాంతాలను ఆక్రమించింది.
మధ్యయుగ
ప్రారంభకాలం భారతీయ గణితశాస్త్రం
అరబ్బు ప్రపంచంలో గణిత,
ఖగోళశాస్త్రం
అభివృద్ధిని ప్రభావితం చేసి
హిందూ సంఖ్యలు ప్రవేశపెట్టబడ్డాయి*.
*🥀క్రీ.పూ.
1206 లో మద్య
ఆసియా టర్కులు ఢిల్లీ సుల్తానేట్
స్థాపించబడడంతో 13 వ
శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో
ముస్లిం పాలన ప్రారంభమైంది.[24]అంతకు
పూర్వమే ఆధునిక ఆఫ్ఘనిస్తాన్,
పాకిస్థాన్లలో
8 వ
శతాబ్దం ప్రారంభంలో ముస్లిం
దండయాత్రలు పరిమితమైన చొరబాట్లు
సృష్టించాయి.[25] 14 వ
శతాబ్దం ఆరంభంలో ఢిల్లీ
సుల్తానేట్ ఉత్తర భారతంలో
ప్రధాన భాగం పాలించినప్పటికీ
14 వ
శతాబ్దం చివరిలో అది
తిరస్కరించబడింది. ఈ
కాలంలో ముఖ్యంగా కాకతీయ,
ముసునూరి,
విజయనగర,
గజపతి,
అహోం,
అలాగే
మేవార్ వంటి అనేక శక్తివంతమైన
హిందూ రాజ్యాలు ఆవిర్భావించాయి.
విజనగర
రక్షణకు పెమ్మసాని,
రావెళ్ళ,
సూర్యదేవర,
వాసిరెడ్డి,
సాయపనేని,
మేదరమెట్ల
తదితర రాజ్యాలు అండగా నిలవటం
విజనగర రాజ్యం దక్షిణ భారతములో
కాకతీయ, ముసునూరి
తరువాత గొప్ప శక్తిగా ఏర్పడినది.
15 వ శతాబ్దం
సిక్కుల ఆగమనాన్ని చూసింది.
మొఘలులు
భారత ఉపఖండంలో అధిక భాగం
స్వాధీనం చేసుకున్న 16
వ శతాబ్దంలో
ఆధునిక కాలం ప్రారంభం
మొదలైంది.[26] 18 వ
శతాబ్దం ప్రారంభంలో మొఘలులు
క్రమంగా క్షీణతను ఎదుర్కొన్నారు.
దీంతో భారత
ఉపఖండంలోని పెద్ద ప్రాంతాలపై
నియంత్రణ సాధించేందుకు
మరాఠాలు, సిక్కులు,
మైసూరియన్లు
అవకాశాలను అందించారు*
*💐18
వ శతాబ్దం
చివరి నుండి 19 వ
శతాబ్దం వరకు బ్రిటీష్
సామ్రాజ్యం బ్రిటీష్ ఈస్ట్
ఇండియా కంపెనీచే భారతదేశంలోని
పెద్ద ప్రాంతాలు అనుసంధానించబడ్డాయి.
కంపెనీ
పాలనతో అసంతృప్తి 1857
నాటి భారతీయ
తిరుగుబాటుకు దారితీసింది.
దాని తరువాత
బ్రిటీషు రాజ్యాలు నేరుగా
బ్రిటీషు క్రౌన్ ద్వారా
నిర్వహించబడ్డాయి.
బ్రిటుషు
పాలనా కాలం మౌలిక సదుపాయాల
అభివృద్ధి, ఆర్థిక
తిరోగమనం, ప్రధాన
కరువులు సంభవించడానికి
సాక్ష్యంగా నిలిచింది.
20 వ శతాబ్ధం
మొదటి అర్ధభాగంలో "
భారతీయ
జాతీయ కాంగ్రెసు "
పార్టీ
నాయకత్వంలో దేశవ్యాప్తంగా
భరతీయ స్వాతంత్ర్య పోరాటం
కొనసాగింది. 1947 ఆగస్టు
15 న
బ్రిటిషు ప్రభుత్వం భరతీయ
ఉపఖండాన్ని భారతదేశం,
పాకిస్తాన్గా
విభజించిన తరువాత భరతదేశం
బ్రిటిషుప్రభుత్వం నుండి
స్వాతంత్రం అందుకుంది*
*🔥చరిత్ర
పూర్వ కాలం (క్రీ.పూ.
3300)🔥*
*రాతి యుగం*
*💐భారతీయ ఉపఖండంలోని శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 78,000-74,000 సంవత్సరాల పూర్వులవని భావిస్తున్నారు.[34][note 1] ఇక్కడ లభించిన ఆధారాలు 5,00,000 సంవత్సరాల నాటి హోమో ఎరెక్టసు వంటి ఆరంభకాల హోమోనిడ్ వని భావిస్తున్నారు.[8][9] మధ్య భారతదేశంలోని నర్మదా లోయలోని హత్నోరాలోని హోమో ఎరేక్టసు అవశేషాలు కనీసం 5,00,000 - 2,00,000 సంవత్సరాల మధ్యప్రాచ్య పాలిస్టోసీను కాలం నుండి భారతదేశప్రాంతం మానవ నివాసిత ప్రాంతంగా ఉంటుందని సూచిస్తున్నాయి.[37][38] భారతీయ ఉపఖండంలోని వాయువ్య భాగంలో రెండు మిలియన్ల సంవత్సరాల క్రితం కనుగొనబడిన ప్రోటో-మానవులు రూపొందించిన ఉపకరణాలు కనుగొనబడ్డాయి.[39][40] ఈ ప్రాంతం పురాతన చరిత్రలో దక్షిణ ఆసియాలోని పురాతన స్థావరాలు,[41] కొన్ని ప్రధాన నాగరికతలు భాగంగా ఉన్నాయి*
*సోయాను నదీలోయలోని పాలియోలిథికు హోమినిదు ప్రాతం భారత ఉపఖండంలోని తొలి పురావస్తు ప్రదేశాలు,[44][45][46] సోనియను పురాతత్వ ప్రాంతాలు భారతదేశం, పాకిస్థాను, నేపాలు దేశాలలో కనిపిస్తాయి.[47][48][49] భారతీయ ఉపఖండంలో మెసోలిథికు కాలం తరువాత నవీన శిలా యుగం (నియోలిథికు) కాలం మొదలైంది. 12,000 సంవత్సరాల క్రితం చివరి మంచు యుగము ముగిసిన తరువాత భారతీయ ఉపఖండంలో విస్తృతమైన మానవస్థావరాలు ఏర్పడ్డాయి. భారతదేశంలోని ఆధునిక మధ్యప్రదేశం లోని భీమ్బేట్కా శిలా గుహలు లో 9,000 సంవత్సరాల క్రితం నాటి మొట్టమొదటి ధ్రువీకరించిన పాక్షికస్థిర స్థావరాలు కనిపించాయి. ఎడక్కల్ గుహలు ఇప్పటికి క్రీ.పూ 6,000 నాటి [50][51] నవీన శిలా యుగం మానవులకు చెందినవని, కేరళ లోని స్థావరాలు, నాగరికత చరిత్రపూర్వం నాటివని భావిస్తున్నారు.[52] దక్షిణ భారతదేశం ఎడక్కల్ రాతియూం చెక్కడాలు చాలా అరుదైన ఉదాహరణలుగా ఉన్నాయి*
*🥀నియోలిథిక్ సంస్కృతికి చెందిన జాతిప్రజలు భారతదేశంలోని ఖంబాట్ గల్ఫులో క్రీ.పూ. 7500 నాటి రేడియోకార్బన్ కాలానికి చెందిన ప్రజలతో విలీనం అయ్యారని భావిస్తున్నారు.[54] భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, హర్యానాలో, లాహూరాడెవా ప్రాంతాలలో కనుగొన్న (క్రీ.పూ. 7000) భారతదేశంలోని భిర్రానా (క్రీ.పూ. 7570-6200) కనుగొన్న భిరానా పరిశోధనలు, (క్రీ.పూ.3000 ) దిగువ గంగాతక్ లోయలో క్రీ.పూ. 5000 కాలంలో సింధూ లోయ ప్రాంతాలలో నియోలిథిక్ వ్యవసాయ సంస్కృతులు ఏర్పడ్డాయి [55] పాకిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతాలలో, [41][56][57] దక్షిణ భారతదేశంలో మెహర్గర్ పరిశోధనలు(క్రీ.పూ.7000-5000 BCE) దక్షిణప్రాంతంలో వ్యాపించాయి. తరువాత ఇది క్రీ.పూ. 1800 లో మాల్వాలో ఉత్తరంవైపు వ్యాపించింది. ఈ ప్రాంతం మొదటి పట్టణ నాగరికత సింధు నాగరికతతో ప్రారంభమైంది*
No comments:
Post a Comment