Saturday, April 4, 2020
భారత రాజ్యాంగ పరిషత్
*💐గోపాల
కృష్ణ గోఖలే 1914లో
మొదటగా భారతదేశానికి ఒక
రాజ్యాంగం అవసరం అని
అభిప్రాయపడ్డాడు. ఆ
తర్వాత 1934లో
కమ్యూనిస్ట్ నాయకుడైన ఎం.
ఎన్.
రాయ్ రాజ్యాంగ
పరిషత్ యొక్క ఆవశ్యకత తెలిపారు.
1935లో భారత
జాతీయ కాంగ్రెస్ కూడా దీన్ని
డిమాండ్ చేసింది. 1940లో
బ్రిటిష్ ప్రభుత్వం ఒక రాజ్యాంగ
పరిషత్తును స్థాపించటానికి
అంగీకరించింది. 1946లో
క్యాబినెట్ మిషన్ ప్లాన్
ద్వారా మొట్టమొదటి సారిగా
రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు
జరిగాయి. రాజ్యాంగ
పరిషత్ సభ్యులను రాష్ట్రాలు
ఎన్నుకుంటాయి. మొత్తం
389 మంది
సభ్యులలో 292 మంది
రాష్ట్రాల నుండి, 93 మంది
సంస్థానాల నలుగురు చీఫ్
కమీషనర్ ప్రావిన్సేస్ అఫ్
ఢిల్లీ, అజ్మీర్,
కూర్గ్,
బ్రిటిష్
బలోచిస్తాన్ నుండి ఎన్నికయ్యారు.
ఆగస్ట్ లో
ఎన్నికలు పూర్తి అయ్యి కాంగ్రెస్
208 స్థానాలను,
ముస్లిం
లీగ్ 73 స్థానాలు
గెలుచుకున్నాయి. తర్వాత
కాంగ్రెస్ తో విభేదించి
ముస్లిం లీగ్ తప్పుకుని
పాకిస్తాన్ కు వేరే పరిషత్
ని మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం
జూన్ ౩న స్థాపించారు.
అలా విడిపోయిన
తర్వాత భారత రాజ్యాంగ పరిషత్
లో 299 స్థానాలు
ఉన్నాయి*
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment