Thursday, April 2, 2020

🔥దక్షిణ భారతదేశ రాజ్యాలు🔥

*🔥దక్షిణ భారతదేశ రాజ్యాలు🔥*



*శాతవాహనుల తర్వాత దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశంలో ముఖ్యమైనవి పల్లవులు చోళులు చాళుక్యులు రాష్ట్రకూటులు*


*🔥పల్లవులు🔥*


*రాజధాని కంచి*

*మొదటి రాజు: సింహవిష్ణు (క్రీస్తుశకం 576 -600 )అతడు విష్ణుభక్తుడు .అవని సింహ అనే బిరుదు కలదు.చోర చోళ పాండ్య వంశాలు ఇతని సౌర్వభౌమ తత్వాన్ని అంగీకరించాయి*.

*🔥మొదటి మహేంద్రవర్మ🔥*

*🍂క్రీస్తుశకం 600 నుంచి 630 వరకు పాలించాడు.ఇతడు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇతడు మొదట జైనమతం అవలంభించినప్పటికి అప్పర్ బోధనల వలన శైవుడయ్యాడు.మత్త విలాస ,విచిత్ర చిత్తూ, చిత్రాకార పులి తదితర బిరుదులను పొందాడు.సంస్కృత భాషలో మత విలాస ప్రహసనం అనే నాటకాన్ని రచించాడు .క్రీస్తు శకం 630 లో బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి చేతిలో ఓటమి పాలయ్యాడు*.



*🔥మొదటి నరసింహ వర్మ (క్రీస్తుశకం 630- 668 )🔥*

*🍂పల్లవుల లో అగ్రగణ్యుడు. బాదామి చాళుక్య రాజు రెండవ పులకేశి ఓడించాడు .మహా మల్ల వాతాపి కొండ అనే బిరుదులు కలవు మహా మల్లాపురం నిర్మించాడు.సంస్కృతంలో కిరాతార్జునీయం రచించిన భార్గవిని పోషించాడు.మహాబలిపురంలో రాతి రథాలను నిర్మించాడు.కాంచీపురం గొప్ప విద్యా కేంద్రంగా విరాజిల్లింది .కాంచీపురం లోని కైలాసనాథ ఆలయం మహాబలిపురంలోని తీర దేవాలయం నిర్మించిన ది మొదటి నరసింహ వర్మ .నరసింహవర్మ తర్వాత రెండవ మహేంద్రవర్మ రాజ్యానికి వచ్చాడు .నరసింహ అనే బిరుదు కలిగిన పల్లవ రాజు రెండవ నరసింహ వర్మ ఇతడు అనేక శివాలయాలు నిర్మించారు ఈ వంశంలో చివరి రాజు రెండవ పరమేశ్వర వర్మ.విద్యా భాషగా సంస్కృతం ఉండేది వీరి అధికార భాష సంస్కృతం.హైందవ మతాభిమానులు సింహవిష్ణు నందివర్మ లో వైష్ణవులు మిగిలినవారు శైవులు*.





*🔥చోళులు🔥*




*రాజధాని తంజావూరు*


*స్థాపకుడు :విజయాలయుడం*


*🍂సంఘము వానికి చెందిన చోళ పాలకులలో కరికాల చోళ గొప్పవాడు ఇతని వారసులు దాడుల నుండి రాజ్యాన్ని కాపాడుకోలేక పోయారు.పల్లవులకు సామంతులు గా ఉన్నారు .పల్లవ రాజ్యం పతనం తర్వాత స్వతంత్రులు అయ్యారు .నవీన్ అర్చకులుగా పిలిచిన వీరికి మూలపురుషుడు విజయాలయుడు.ఈయన క్రీస్తు శకం 850 -871 మధ్య పాలించాడు* .

*🔥మొదటి రాజరాజ చోళుడు( క్రీస్తుశకం985 -1014)🔥 నవీన చోళులలో ఇతడు అగ్రగణ్యుడు .తంజావూరులోని బృహదీశ్వరాలయం నిర్మించాడు గొప్ప శివ భక్తుడు శివ పాద శేఖర అనే బిరుదు ధరించాడు .నాగ పట్టణంలో భౌద్ధ విగ్రహాన్ని పెట్టడానికి అనుమతి ఇచ్చి ఒక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు గ్రామ సుపరిపాలనను ప్రోత్సహించాడు*.



*🔥మొదటి రాజేంద్రుడు (క్రీస్తుశకం 1014 -1044 )🔥*

*🍂రాజేంద్రన్ ఈ కాలంలోనే చోళ వైభవం పరాకాష్ట అందుకుంది .రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించి గంగైకొండ అనే బిరుదు ధరించాడు శ్రీ విజయ రాజ్యంపై దండెత్తి గంగై కొండ అనే బిరుదు పొందాడు.గంగై కొండ చోళపురం అనే నగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు .ఈ వంశంలో చివరి రాజు మూడవ రాజేంద్రుడు కాకతీయ గణపతి దేవుడు ఇతడిని ఓడించి వరకు గల ప్రాంతాన్ని ఆక్రమించాడు.చోళుల దేవాలయాల నిర్మాణం లో ద్రావిడ శైలి అత్యున్నత స్థాయిని అందుకుంది.చిదంబర దేవాలయంలోని నటరాజ విగ్రహం చోళుల శిల్ప కళా రీతికి నిలువెత్తు సత్కారం .వీరి కాలం తమిళ భాషకు స్వర్ణయుగం.తమిళ గ్రంథాలైన శివాగా సిద్ధమని కంబ రామాయణం నాటి సాహిత్య వికాసానికి ఉదాహరణలు.పరిపాలనలో చక్రవర్తి అత్యున్నత సార్వభౌమాధికారం .సామ్రాజ్యాన్ని మండలాలుగా, మండలాలను కొట్టం, కొట్టం నాడుగా ,నాడుని కుర్రం గా విభజించారు.అవునా ఆర్థిక వ్యవస్థలో వ్యాపారానికి ప్రముఖ స్థానం ఉండేది ఒకటే వేయించిన శాసనం చోళుల కాలంలో అమలులో ఉన్న గ్రామ పరిపాలన గురించి వివరణ ఇస్తుంది*.


No comments:

Post a Comment